రైతుల ఆందోళనతో రైల్వేలకు రూ.1,200 కోట్ల నష్టం

కేంద్రం తీసుకువచ్చిన రైతు సంస్కరణల బిల్లులకు వ్యతిరేకంగా పంజాబ్‌లో రైతుల ఆందోళన కొనసాగుతుండటంతో రైల్వేలకు రూ.1,200 కోట్ల మేరకు నష్టం వచ్చింది. దిగ్బంధాల కారణంగా రవాణా కార్యకలాపాలు ఇప్పటికీ సస్పెండైనట్టు భారత రైల్వేలు తెలిపాయి.

దీంతో ఇంతవరకూ నిత్యావసర సరుకలు తీసుకువెళ్తున్న 2,225 ఫ్రైట్ రేక్స్ తెరుచుకోలేదని రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ట్రాక్‌ల భద్రత, రైల్ ఆపరేషన్ల పునరుద్ధరణ జరిపే సిబ్బందికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలంటూ అక్టోబర్ 26న రైల్వే మంత్రి పీయూష్ గోయెల్ సైతం పంజాబ్ ప్రభుత్వానికి లేఖ రాశారు.

కేంద్రం తెచ్చిన రైతు సంస్కరణ బిల్లులకు వ్యతిరేకంగా రైతు నిరసనలు కొనసాగుతుండటంతో ఇంతవరకూ 1,350 ప్యాసింజర్ రైళ్లు రద్దయ్యాయని, కొన్నింటిని దారి మళ్లించాల్సి వచ్చిందని రైల్వే శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రైత నిరసనల ప్రభావం పంజాబ్ మీదుగా వెళ్లే ప్యాసింజర్ రైళ్లపై కూడా పడిందని, కోవిడ్ సమయంలో ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగిందని పేర్కొంది. సరకుల రవాణా 

రాకపోకల ప్రభావం పంజాబ్‌తో పటు, లఢక్, హిమాచల్ ప్రదేశ్‌పైన కూడా పడిందని తెలిపింది. గత సెప్టెంబర్‌లో రైతు గ్రూపులు, యూనియన్లు ఆందోళనకు దిగుతూ మూడు రోజుల రైల్‌రోకోకు పిలుపునిచ్చాయి. ఆ తర్వాత కూడా ఆందోళనలు కొనసాగుతూ వచ్చాయి.