మాజీ కేంద్ర మంత్రి, జర్నలిస్ట్ అరుణ్శౌరిపై సిబిఐ ప్రత్యేక కోర్టు అవినీతి కేసు నమోదు చేసింది. రాజస్థాన్లోని ఉదయ్ పూర్లో లక్ష్మీ విలాస్ ప్యాలెస్ హోటల్లో పెట్టుబడులు పెట్టారన్న అక్రమ కేసులో మాజీ మంత్రి అరుణ్శౌరిని నిందితుడిగా పేర్కొంది.
అరుణ్శౌరితో పాటు మాజీ ప్రభుత్వ అధికారి ప్రదీప్ బైజాల్, జ్యోత్న శౌరిలను కూడా నిందితులుగా పేర్కొంది. అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో పెట్టుబడుల మంత్రిగా పనిచేసిన అరుణ్శౌరి హోటల్స్ విక్రయంలో అవతవకలకు పాల్పడ్డారని, భారీ నష్టం వచ్చినట్లుగా ప్రభుత్వానికి లెక్కలుచూపారని కోర్టు పేర్కొంది.
హోటల్స్ విక్రయాన్ని తిరిగి ప్రారంభించాలని ఆదేశించినపుడు ఈ అక్రమం వెలుగులోకి వచ్చిందని తెలిపింది. హోటల్ లక్ష్మీ విలాస్ ధర రూ. 252 కోట్లు కాగా, కేవలం రూ. 7.5 కోట్లకు విక్రయించినట్లు కోర్టు వెల్లడించింది. 2019లో ఈ కేసును సాక్ష్యాధారాలు లేవంటూ సిబిఐ కేసును కొట్టివేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో తిరిగి విచారణ చేపట్టాలంటూ జోద్పూర్ ప్రత్యేక కోర్టు ఆదేశించింది.
హోటల్ అమ్మకాన్ని తిరిగి ప్రారంభించాలని కోర్టు కోరింది. కాగా, హోటల్ ను వెంటనే స్వాధీనం చేసుకోవాలని ఉదయపూర్ జిల్లా కలెక్టర్ను కోర్టు ఆదేశించింది. “మేము కోర్టు ఆదేశాన్ని అమలు చేస్తాం” అని ఉదయపూర్ కలెక్టర్ చేతన్ దేవ్డా అన్నారు.కోర్ట్ఆ దేశాలు చూసిన తర్వాత ఏమి చేయాలో నిర్ణయిస్తామని సీబీఐ ప్రత్యేక కోర్టు ఉత్తర్వుపై అరుణ్ శౌరీ తెలిపారు.
More Stories
ముడా స్కామ్లోరూ. 300 కోట్ల ఆస్తుల జప్తు
కర్ణాటకలో పట్టపగలే బ్యాంక్ లో రూ 12 కోట్లు దోపిడీ
సంచలన ఆరోపణలు చేసే హిండెన్బర్గ్ రీసెర్చ్ మూసివేత