
దేశం లో చేనేత రంగాన్ని ప్రోత్సహించడానికి నాలుగు పథకాలను జౌళి మంత్రిత్వ శాఖ కు చెందిన డెవలప్ మెంట్ కమిషనర్ ఫర్ హ్యాండ్లూమ్స్ అమలు చేస్తున్నట్లు జౌళి శాఖ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు.
చేనేత రంగాన్ని ప్రోత్సహించేందుకు అమలవుతున్న నాలుగు పథకాలలో జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం (ఎన్ హెచ్ డిపి), కాంప్రిహెన్సివ్ హ్యాండ్ లూమ్స్ క్లస్టర్ డెవెలప్ మెంట్ స్కీమ్ (సి హెచ్ సి డి ఎస్), హ్యాండ్లూమ్ వీవర్స్ కాంప్రిహెన్సివ్ వెల్ఫేర్ స్కీమ్ (హెచ్ డబ్ల్యు సి డబ్ల్యు ఎస్) లతో పాటు, యార్న్ సప్లై స్కీమ్ (వైఎస్ఎస్) భాగం గా ఉన్నాయని వివరించారు.
ఈ పథకాల ద్వారా ముడి పదార్థాలు, మగ్గాలు, ఇతర యంత్ర భాగాల కొనుగోలు కోసం కోసం ఆర్థిక సహాయాన్ని అందించడం, కొత్త కొత్త డిజైన్లు, వివిధ రకాల ఉత్పత్తులు, మౌలిక సదుపాయాల విస్తరణ, నైపుణ్యాల పెంపు, చేనేత ఉత్పత్తుల మార్కెటింగ్ కార్యకలాపాలకు మద్దతివ్వడం, తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. 4వ అఖిల భారత చేనేత సెన్సస్ 2019-2020 ప్రకారం చేనేత కార్మిక కుటుంబాల మొత్తం సంఖ్య 31,44,839 గా ఉందని మంత్రి స్మృతీ ఇరానీ తెలిపారు.
3వ చేనేత సెన్సస్ 2009-2010 ప్రకారం దేశం లో చేనేత కార్మిక కుటుంబాలు 27,83,271 గా నమోదయినట్లు ఆమె గుర్తు చేశారు. చేనేత కుటుంబాల సరాసరి సంపాదన 2009-10 లో సంవత్సరానికి 36,498 రూపాయలుగా ఉందని చెప్పారు. 3వ చేనేత సెన్సస్ లో తెలిసిన సమాచారం బట్టి చూస్తే, చేనేత కుటుంబాల లో నూటికి 99 కుటుంబాలు నెలకు 5 వేల రూపాయల ఆదాయాన్ని పొందుతున్నట్లు ఆమె వెల్లడించారు.
More Stories
మార్కెట్లో ప్రవేశించిన రూ 500 నకిలీ నోట్లు
చైనాపై సుంకాలతో భారత్ ఆటబొమ్మలకు సువర్ణకాసం
విదేశీ కంపెనీలకు అవకాశమిస్తూ `అణు’ చట్టాల్లో మార్పులు!