భక్తుల ఇబ్బందులు, సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు నిర్వహించే డయల్ యువర్ ఈవో కార్యక్రమాన్ని టీటీడీ ఆదివారం నిర్వహించనుంది.
తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో గల సమావేశ మందిరంలో ముఖ్యమైన అధికారుల సమక్షంలో డయల్ యువర్ కార్యక్రమం జరుగుతుంది.
ఉదయం 9 నుండి 10 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. ఈ సమయంలో భక్తులు చేసే ఫోన్ కాల్స్ ను ఈవో అనిల్ కుమార్ సింఘాల్ స్వయంగా లిఫ్ట్ చేసి మాట్లాడతారు.
భక్తులు తమ సందేహాలను, సూచనలను టిటిడి కార్యనిర్వహణాధికారి అనిల్కుమార్ సింఘాల్ ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261.

More Stories
పింగళి వెంకయ్యకు మోదీ, అమిత్ షా, రాజ్నాథ్ నివాళులు
`వికసిత్ భారత్’ కు ఒక కీలక వృద్ధి చోదకంగా ఆంధ్రప్రదేశ్
సనాతన ధర్మాన్ని రాజకీయ పరిహాసానికి వేదిక చేయొద్దు