
ఇప్పటి వరకు పట్టాన ప్రాంతాలకే పరిమితమైన చెత్త సేకరణకు సేవా ఋణం వసూలును ఇప్పుడు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం గ్రామాలలో కూడా అమలు చేయనున్నది. ‘మన ఊరుామన పరిశుభ్రత’ పేరుతో ఎంపిక చేసిన గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టును చేపట్టింది. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే సుమారుగా 1000కు పైగా గ్రామపంచాయతీల్లో ప్రస్తుతం చెత్త సేకరణకు ఛార్జీలు వసూలు చేస్తున్నట్టు సమాచారం. అన్ని జిల్లాల్లోనూ ప్రతి మండలం నుంచి కనీసం రెండు పంచాయతీలను ఎంపిక చేసినట్టు చెబుతున్నారు.
పైలట్ ప్రాజెక్టులో భాగంగా రోజుకు రూ.2 చొప్పున నెలకు రూ.60 ప్రతి ఇంటి నుంచీ వసూలు చేస్తున్నారు. సంవత్సరానికి సంబంధించిన మొత్తాన్ని ఒకేసారి కట్టించుకుంటున్నారు. ఈ మొత్తాన్ని వసూలు చేసే బాధ్యతతో పాటు చెత్త సేకరణను పర్యవేక్షించే బాధ్యతను గ్రామ వాలంటీర్లకు అప్పగించారు.
నేరుగా యూజర్ఛార్జీలు, సేవా రుసుమని అనకుండా అనేక చోట్ల విరాళాల పేరుతో వసూలు ఈ మొత్తాన్ని వసూలు చేస్తున్నారు. ఎవరైనా కట్టలేమని చెబితే వారికి ప్రభుత్వం నుండి వచ్చే అన్ని రకాల పథకాలు నిలిచిపోతాయని బెదిరిస్తున్నట్లు తెలుస్తున్నది.
More Stories
దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష ఆరోపణలపై కిషన్ రెడ్డి ఆగ్రహం
అమరావతి పర్యటనలో ప్రధాని మోదీ రోడ్ షో రద్దు
ఏపీ పట్టణాల్లో స్లీపర్సెల్స్ పై పోలీసుల డేగకన్ను