కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో గ్రామాలకు తిరిగి వచ్చే వలస కార్మికులకు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రభావితమైన పౌరులకు తగిన జీవనోపాధి అవకాశాలను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘గరీబ్ కల్యాణ్ రోజ్గార్ అభియాన్’ (జీకేఆర్ఏ) గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎంతో ఊతమిస్తున్నది.
బీహార్, జార్ఖండ్, మధ్య ప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ వంటి ఆరు రాష్ట్రాలలో స్వగ్రామాలకు తిరిగి వచ్చిన వలస కార్మికులకు ఉపాధి కల్పించడానికి అభియాన్ మిషన్ మోడ్లో చర్యలను తీసుకుంటున్నది. అభియాన్ ఈ రాష్ట్రాల్లోని 116 జిల్లాల్లో జీవనోపాధి అవకాశాలతో స్థానిక గ్రామస్తులను ఆదాయ మార్గాల వైపు మళ్లిస్తున్నది. 9వ వారం నాటికి మొత్తం 24 కోట్ల పనిదినాల మేర ఉపాధి కల్పించారు.
అభియాన్ లక్ష్యాల సాధన కోసం ఇప్పటి వరకు రూ.18,862 కోట్ల నిధులను వ్యయం చేశారు. ఇందులో భాగంగా 85,786 నీటి సంరక్షణ నిర్మాణాలను, 2,63,846 గ్రామీణ గృహాలను, 19,397 పశువుల షెడ్లను, 12,798 వ్యవసాయ చెరువులను, 4,260 కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ల నిర్మాణాలను పెద్ద సంఖ్యలో చేపట్టారు.
6342 పనులను జిల్లా ఖనిజ నిధుల ద్వారా చేపట్టారు. అభియాన్లో భాగంగా 1002 గ్రామ పంచాయతీలకు ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించారు, ఘన , ద్రవ వ్యర్థ పదార్థాల నిర్వహణకు సంబంధించిన మొత్తం 13,022 పనులను చేపట్టారు. 31,658 మంది అభ్యర్థులకు కృషి విజ్ఞాన కేంద్రాలు (కేవీకే) ద్వారా నైపుణ్య శిక్షణ అందించారు.
వలస కార్మికులకు, గ్రామీణ వర్గాలకు అధిక మొత్తంలో ప్రయోజనాన్ని చేకూర్చుతున్నాయి. తమతమ స్వస్థలాలలోనే తిరిగి ఉండిపోయేందుకు ఎంచుకునే వారికి ఉద్యోగాలు , జీవనోపాధి కోసం దీర్ఘకాలిక చొరవతో కూడిన వేదిక ఈ అభియాన్ వల్ల సిద్ధమైంది.
More Stories
బాధితులపైనే హత్యాయత్నం కేసు నమోదు
తెలంగాణాలో పెరుగుతున్న హిందువులపై దాడులు
నక్సలైట్ల తుపాకీ గుండ్లకు నేలకొరిగిన జిత్తన్న