అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కోసం ఒక మహిళ 28 ఏండ్లుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. అయోధ్యలోని రామాలయాన్ని సందర్శించి ప్రసాదం తిన్న తర్వాతే తన దీక్షను విరమిస్తానని ఆమె చెబుతున్నారు.
మధ్యప్రదేశ్లోని జబల్పూర్కు చెందిన ఊర్మిళ చతుర్వేదికి ఇప్పుడు 82 ఏండ్లు. 1992లో బాబ్రీ మసీదు ధ్వంసం అనంతరం జరిగిన మత ఘర్షణలతో ఆమె కలత చెందారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరిగే వరకు ఆహారం తీసుకోకూడదని నాడు నిర్ణయించుకున్నారు.
నాటి నుంచి 28 ఏండ్లుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. కేవలం పాలు, పెరుగు, పండ్లు తింటూ జీవిస్తున్నారు. అయోధ్యలోని భవ్య రామ మందిర నిర్మాణానికి ఈ నెల 5న ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో అయోధ్యలోని రాముడ్ని దర్శించుకుని ఆ ప్రసాదంతో తన నిరాహార దీక్షను విరమిస్తానని ఊర్మిళ చతుర్వేది తెలిపారు.
More Stories
వయనాడ్ నుంచి ప్రజలు రాహుల్ ను తరిమికొడతారు
అధికారంలోకి వస్తే ఎలక్టోరల్ బాండ్స్ని మళ్లీ తీసుకొస్తాం
తొలి దశలో 62.37 శాతం మాత్రమే పోలింగ్