కరోనాపై పోరులో బయోటెక్నాలజీ పరిశోధనలు కీలకం

బయోటెక్నాలజీ రంగంలో పరిశోధనలు మరింత వేగవంతం కావాలని గవర్నర్‌ డా. తమిళిసై సౌందరరాజన్‌ సూచించారు. ఈ పరిశోధనలు కోవిడ్‌-19పై పోరాటంలో కీలకమని అన్నారు. కోవిడ్‌-19 నివారణ వ్యాక్సిన్‌ అభివఅద్ధికి, ఔషధాల తయారీకి బయోటెక్నాలజీ, ఫార్మా, వైద్య రంగాల సమ్మిళిత పరిశోధనలు అత్యంతావశ్యకం అని గవర్నర్‌ తెలిపారు.
 
 ”ఫ్రాంటియర్స్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ, బయో ఇంజినీరింగ్‌-2020” అనే అంశంపై జెఎన్‌టియు హైదరాబాద్‌ ఆధ్వర్యంలో మూడు రోజుల జాతీయ సదస్సును రాజ్‌భవన్‌ నుండి ఆన్‌లైన్‌ ద్వారా ప్రారంభిస్తూ  కోవిడ్‌ సంక్షోభం సంక్లిష్ట సమస్యలను ప్రపంచం ముందుంచిందని ఆందోళన వ్యక్తం చేశారు. 
 
ఈ సమస్యను అధిగమించాలంటే బయోటెక్నాలజీ, బయో ఇంజనీరింగ్‌ ఇతర ఆధారిత అనుసంధాన రంగాలలో పరిశోధనలు, అభివఅద్ధి మరింత వేగవంతం కావాలని, శాస్త్రవేత్తలు ఈ దిశగా కృషి చేయాలని ఆమె సూచించారు. భారతదేశం బయోటెక్నాలజీ రంగంలో గ్లోబల్‌ లీడర్‌గా ఎదుగుతున్నదని, ప్రస్తుతం బయోటెక్నాలజీ రంగంలో ఐదో అతిపెద్ద దేశంగా ఉందని ఆమె పేర్కొన్నారు. 
 
త్వరలోనే గ్లోబల్‌ మార్కెట్‌లో 20 శాతం సాధిస్తుందని చెబుతూ బయోటెక్నాలజీ, జీవశాస్త్రాల హబ్‌గా హైదరాబాద్‌ ఎదుగుతున్నదని గవర్నర్‌ కొనియాడారు. హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక జీనోమ్‌ వ్యాలీ ఇప్పటికే అనేక అంతర్జాతీయ సంస్థలకు, పరిశోధనలకు నెలవుగా మారిందని ఆమె పేర్కొన్నారు. 
 
 కోవిడ్‌ వ్యాక్సిన్‌ అభివఅద్ధిలో సహితం హైదరాబాద్‌ ముందంజలో ఉందని తమిళిసై వెల్లడించారు. సైన్స్‌లో మహిళా పరిశోధకులను ప్రోత్సహించే లక్ష్యంతో జెఎన్‌టియు హైదరాబాద్‌, ఆర్గనైజేషన్‌ ఫర్‌ విమెన్‌ ఇన్‌ సైన్స్‌ ఫర్‌ ది డెవలపింగ్‌ వరల్డ్‌ సంస్థతో భాగస్వామ్యం వహించడం పట్ల గవర్నర్ సంతోషం వ్యక్తం చేశారు. 
 
సైన్స్‌లో మహిళా పరిశోధకులకు, ఔత్సాహికులకు మరింత ప్రోత్సాహం లభించాలని ఆమె సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జై జవాన్‌, జై కిసాన్‌ నినాదానికి జై విజ్ఞాన్‌ అన్న నినాదం కూడా జతచేసి సైనికులు, రైతుల సరసన శాస్త్రవేత్తలకు సముచిత గౌరవం కల్పించారని గవర్నర్‌ గుర్తు చేశారు.