హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో కరోనా వైరస్ కలకలం రేపుతున్నది. అక్కడ పనిచేస్తున్న 28 మంది భద్రతా సిబ్బందికి, మరో 20 మంది రాజ్భవన్లో పనిచేస్తున్న సిబ్బందికి, వారి కుటుంబసభ్యులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.
మొత్తం 395 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో 347 మందికి నెగెటివ్గా వచ్చిందని రాజ్భవన్ వర్గాలు వెల్లడించాయి. కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిన 28 పోలీసు సిబ్బందిని ఐసోలేషన్ వార్డుకు, మిగతా 20 మందిని ఎర్రగడ్డలోని ఆయుర్వేద ఆస్పత్రికి తదుపరి చికిత్స నిమిత్తం తరలించినట్టు రాజ్భవన్ వర్గాలు పేర్కొన్నాయి.
ఈ నేపథ్యంలోనే రాష్ట్ర గవరానర్ తమిళిసై సౌందరరాజన్ తో పాటు పలువురు సీనియర్ అధికారులు కూడా కరోనా పరీక్షలు చేయించుకున్నారు. వారందరికీ ఫలితాల్లో నెగెటివ్గా నిర్ధారణ అయ్యింది.
More Stories
వీవీప్యాట్లపై పిటిషన్లను కొట్టేసిన సుప్రీం కోర్టు
లండన్ భారత హైకమిషన్పై దాడి నిందితుడి అరెస్ట్
అగ్నికి ఆజ్యం పోసిన శామ్పిట్రోడా వారసత్వ పన్ను ప్రస్తావన