చైనాపై ఎనిమిది దేశాల కూటమి ముప్పేట దాడి 

వుహాన్ నగరం నుంచి కరోనా వైరస్ వ్యాప్తి కారణమైన చైనాపై అమెరికాతోపాటు అనేక దేశాలు ఆగ్రహంతో ఉన్నాయి. చైనా లక్ష్యంగా ముప్పేట దాడి చేసేందుకు ఎనిమిది దేశాల కూటమి సిద్దమైంది. ఈ మేరకు చర్చించేందుకు ఈ ఎనిమిది దేశాల కూటమి సభ్యులు తమ కూటమికి ఇంటర్‌ పార్లమెంటరీ అలయెన్స్‌ ఆన్‌ చైనా (ఐపీఏసీ) అని పేరు పెట్టారు.

మానవ హక్కులను కాలరాయడం, ప్రపంచ వాణిజ్యం, భద్రతకు చైనా ముప్పుగా మారుతోందని ఈ కూటమి నాయకులు ఆరోపిస్తున్నారు. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, చైనాకు సంబంధించిన సమస్యలపై చురుకుగా, వ్యూహాత్మకంగా సిద్ధం చేయడమే తమ లక్ష్యమని ఈ కూటమి సభ్యులు పేర్కొంటున్నారు.

ఈ సంకీర్ణంలో అమెరికాకు చెందిన రిపబ్లికన్ సెనేటర్ మార్కో రూబియో, డెమొక్రాట్ బాబ్ మెనెండెజ్, జపాన్ మాజీ విదేశాంగ మంత్రి జేన్ నకటాని, యూరోపియన్ పార్లమెంటులో విదేశీ వ్యవహారాల కమిటీ సభ్యుడు మిరియం లెక్స్‌మన్, బ్రిటన్‌లోని కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ ఇయాన్ డంకన్ స్మిత్ ఉన్నారు. ఇవే కాకుండా.. జర్మనీ, ఆస్ట్రేలియా, కెనడా, స్వీడన్, నార్వే దేశాల నాయకులు కూడా ఈ కూటమితో ఉన్నారు.

– చైనా గట్టి వైఖరిని అవలంభించడం మూలంగా ఎంపీల కూటమిగా ఏర్పడిన ఈ దేశాలు రాజకీయ, ఆర్థిక పరిణామాలను ఎదుర్కొన్నాయి.

– చైనాకు చెందిన హువావే టెక్నాలజీ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ను కెనడాలో అరెస్టు చేసినప్పుడు, చైనా కూడా ఇద్దరు కెనడా పౌరులను మరుగుదొడ్డి ప్రాంతంలో అదుపులోకి తీసుకుంది.

– చైనాతో నార్వేకు ఆరేండ్ల నాటి వ్యాపార సంబంధం ఉన్నది. చైనా ప్రభుత్వంపై విమర్శలు చేసిన వ్యక్తికి నార్వే శాంతి నోబెల్ బహుమతి ఇవ్వడంతో చైనా క్రమంగా నార్వేతో తన వాణిజ్య సంబంధాలను తగ్గించుకొన్నది.

– కొవిడ్-19 మహమ్మారికి చైనాను ఆస్ట్రేలియా నిందించిన సమయంలో.. ఆస్ట్రేలియా బార్లీపై చైనా కొత్త సుంకాలను విధించింది. కొన్ని రకాల మాంసం దిగుమతులను కూడా నిషేధించింది.