
ప్రముఖ కథానాయిక నిధి అగర్వాల్ హైదరాబాద్లోని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ఓ గుర్తు తెలియని వ్యక్తి తనను సోషల్ మీడియాలో వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఓ వ్యక్తి తనను, తన కుటుంబాన్ని చంపుతానని బెదిరిస్తున్నాడని తెలిపింది. అసభ్యకర మెసేజ్లతో తన ఇన్స్టా అకౌంట్కి పదేపదే ట్యాగ్ చేస్తున్నాడని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఆ వ్యక్తి బెదిరింపుల వల్ల తాను, తన కుటుంబం మానసికంగా ఒత్తిడికి లోనవుతున్నామని సైబర్ క్రైమ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో నిధి అగర్వాల్ పేర్కొంది. నిందితుడిని గుర్తించి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిధి అగర్వాల్ పోలీసులను కోరింది. ఈ మేరకు స్పందించిన పోలీసులు నిధి అగర్వాల్ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రస్తుతం హీరోయిన్ నిధి అగర్వాల్ ఇద్దరు అగ్ర హీరోల సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. పవన్ సరసన ‘హరిహర వీరమల్లు’లో, ప్రభాస్ ‘రాజా సాబ్’లోనూ నటిస్తున్నారు.
More Stories
గవర్నర్ ఆమోదం పొందని రిజర్వేషన్ల బిల్లులు
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత