టెక్నాలజీ వినియోగంలో నైతికత పాటించాల్సిందే

టెక్నాలజీ వినియోగంలో నైతికత పాటించాల్సిందే

ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక పరిజ్ఞాన వినియోగం విషయంలో నిబంధనలను రూపొందించాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. అందుకోసం అంతర్జాతీయ సంస్థలు​ కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. నాలుగేళ్లకు ఒకసారి జరిగే వరల్డ్ టెలీకమ్యూనికేషన్‌ స్టాండర్డైజేషన్‌ అసెంబ్లీ-2024ను డిల్లీలోని భారత్​ మండపంలో ప్రధాని మోదీ మంగళవారం ప్రారంభించారు.

అలాగే దేశీయ ఆవిష్కరణలు ప్రదర్శించేందుకు నిర్వహించే ఇండియన్‌ మొబైల్ కాంగ్రెస్‌ ఈవెంట్‌ 8వ ఎడిషన్‌ను కూడా ఈ కార్యక్రమంలోనే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విమానయాన రంగానికి గ్లోబల్​ కమ్యూనిటీ సమగ్రమైన ఫ్రేమ్​వర్క్​ను రూపొందించినట్లే, డిజిటల్ ప్రపంచానికి కూడా నియమాలు, నిబంధనలు అవసరమని స్పష్టం చేశారు.

‘భారతదేశంలో 120 కోట్ల మొబైల్​, 95 కోట్ల ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు. ప్రపంచంలోనే 40 శాతానికి పైగా డిజిటల్ లావాదేవీలు భారతదేశంలో జరుగుతున్నాయి. డిజిటల్ పబ్లిక్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ను విజయవంతంగా నిర్మించడంలో భారతదేశం తన అనుభవాన్ని ఇతర దేశాలతో పంచుకోవడానికి సిద్ధంగా ఉంది’ అని ప్రధాని తెలిపారు. డిజిట‌ల్ క‌నెక్టివిటీ చాలా కీల‌క‌మైన టూల్‌గా మారిన‌ట్లు తెలిపారు.

“కేవలం పదేళ్లలోనే ఏర్పాటు చేసిన ఆప్టికల్ ఫైబర్-​ భూమి, చంద్రుని మధ్య దూరం కంటే ఎనిమిది రెట్లు ఎక్కువ. రెండు సంవత్సరాల క్రితం మొబైల్​ కాంగ్రెస్​లోనే 5జీ సేవలను ప్రారంభించాం. దేశంలోని ప్రతి జిల్లాను 5జీ సేవలతో అనుసంధానం చేశాం. ఇప్పుడు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద 5జీ మార్కెట్​గా భారతదేశం అవతరించింది. ప్రస్తుతం 6జీ టెక్నాలజీ కోసం తీవ్రంగా కృషి చేస్తున్నాం” అని మోదీ తెలిపారు.

భారతదేశం గత దశాబ్దంలో దిగుమతిదారుడి నుంచి మొబైల్ ఫోన్స్ ఎగుమతిదారుగా మారిందని ప్రధాని మోదీ గుర్తు చేశారు. ‘2014లో దేశంలో రెండు మొబైల్ తయారీ యూనిట్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఆ సంఖ్య 200పైకి చేరింది. ఇంతకుముందు విదేశాల నుంచి ఫోన్​లను దిగుమతి చేస్తున్నాం. ప్రస్తుతం ఏకంగా ఆరు రెట్లు మొబైల్స్​ను తయారు చేస్తున్నాం’ అని ప్రధాని చెప్పారు.
`చిప్​లతో మాత్రమే ఆగిపోలేదు. ప్రపంచానికి మేడిన్​ ఇండియా మొబైల్స్ అందిచడంలో నిమగ్నమై ఉన్నాం. సెమీ కండక్టర్స్ రంగంలో భారీ పెట్టుబడులు పెడుతున్నాం. ఎగుమతులు కూడా గణనీయంగా పెరిగాయి. సాంకేతికత వినియోగంపై అప్రమత్తంగా ఉండాలి. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ను మంచి కోసమే వినియోగించాలి’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌ను ఎథిక‌ల్‌గా వాడే అంశంపై కూడా వ‌ర్కౌట్ చేయాల‌ని ప్రధాని సూచించారు.  రెండేళ్ల క్రితం మొబైల్ కాంగ్రెస్ స‌మావేశాల్లో 5జీని ఆవిష్క‌రించిన‌ట్లు తెలిపారు. ప్ర‌స్తుతం అన్ని జిల్లాల్లోనూ 5జీ సేవ‌లు విస్త‌రించిన‌ట్లు ఉన్న‌ట్లు వెల్ల‌డించారు. ప్ర‌పంచంలోనే అతిపెద్ద రెండ‌వ 5జీ మార్కెట్‌గా ఇండియా నిలిచిన‌ట్లు చెప్పారు. 6జీ కోసం కూడా వేగంగా ప‌నులు జ‌రుగుతున్న‌ట్లు తెలిపారు.