కాంగ్రెస్ అవినీతి గురించి మాట్లాడుతూ, సోనియా గాంధీని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసే పార్టీ 9 సమన్లు జారీ చేసినా ఈడీ ఎదుట విచారణకు హాజరుకాకపోవడం దురదృష్టకరమని అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. కేజ్రీవాల్ ఎందుకు దర్యాప్తు నుంచి తప్పించుకు తిరుగుతున్నారు..ఈ లిక్కర్ కుంభకోణంలో అంతా బయటపడిందని అన్నారు. ఢిల్లీ నూతన మద్యం విధానం మెరుగైనదే అయితే దాన్ని ఎందుకు వెనక్కి తీసుకున్నారని బీజేపీ నేత రాంవీర్ సింగ్ బిధూరీ ఆప్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఎక్సైజ్ పాలసీ సరైంది కాదని తాను అరవింద్ కేజ్రీవాల్తో చెప్పానని, ఈ పాలసీతో ప్రభుత్వానికి రూ. 3000 కోట్లు నష్టం వాటిల్లిందని చెప్పారు. ఇక అరవిద్ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎంగా ఎప్పటికీ కొనసాగుతారని ఢిల్లీ మంత్రి అతిషి స్పష్టం చేశారు. జైలు నుంచే ఆయన పాలన నడిపిస్తారని చెప్పారు. కేజ్రీవాల్ దోషిగా తేలలేదని, ఆయన ఢిల్లీ సీఎంగా ఉంటారని తెలిపారు.
కర్మ ఫలితం వెంటాడింది
కేజ్రీవాల్తో పాటు అన్నా హజారే బృందం గతంలో షీలా దీక్షిత్ సహా కాంగ్రెస్ నేతలపై నిరాధార, బాధ్యతారాహిత్య ఆరోపణలు చేశారని, షీలా దీక్షిత్పై ఎన్నో ఆధారాలున్నాయని కేజ్రీవాల్ పేర్కొన్నారని ఆమె గుర్తుచేశారు. అయితే ఆ ఆధారాలను ఇప్పటివరకూ ఎవరూ చూడలేదని, కానీ కర్మ ఫలితం అనుభవించాలని ఎక్స్ వేదికగా శర్మిష్ట పోస్ట్ చేశారు.
More Stories
మోదీకి అండగా 60 కోట్ల మంది లబ్ధిదారుల సైన్యం
ఈడీ స్వాధీనం చేసుకున్న సొమ్మును పేదలకు చెందేలా చేస్తాం
కేజ్రీవాల్ పిఎ చెంపపై, కడుపులో కొట్టి, కాలుతో తన్నాడు