కోల్కతా, గురుగ్రాం, ఢిల్లీ, ఇండోర్, ముంబై, రాయ్పూర్లో ఈడీ దాడులు చేపట్టింది. దాడుల సందర్భంగా రూ. 1.86 కోట్ల నగదు, రూ. 1.78 కోట్ల విలువైన వస్తువులతో పాటు నేరం ద్వారా ఆర్జించిన రూ. 580 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ స్తంభింపచేసింది. మహదేవ్ యాప్ కేసులో ప్రధాన ప్రమోటర్లు సౌరవ్ చంద్రార్కర్, రవి ఉప్పల్కు వ్యతిరేకంగా ఓ చార్జిషీట్తో పాటు ఈడీ రెండు చార్జిషీట్లను దాఖలు చేసింది.
ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీస్ ఆధారంగా ఇద్దరు ప్రమోటర్లను ఇటీవల దుబాయ్లో అదుపులోకి తీసుకున్నారు. వారిని భారత్కు అప్పగించేలా ఈడీ కసరత్తు సాగిస్తోంది. తొలి చార్జిషీట్లో చంద్రాకర్ రస్ అల్ ఖైమాలో తన పెండ్లికి ఏకంగా రూ. 200 కోట్లు వెచ్చించాడని ఈడీ ఆరోపించింది. చంద్రార్కర్ బంధువుల కోసం ప్రైవేట్ జెట్స్ను బుక్ చేశారని, సెలబ్రిటీల పెర్ఫామెన్స్ కోసం పెద్ద మొత్తం ఖర్చుచేశారని పేర్కొంది. ఈ కేసులో మొత్తం రూ. 6000 కోట్ల వరకూ అక్రమ లావాదేవీలు జరిగాయని ఈడీ గుర్తించింది.
More Stories
నాలుగు నెలల్లో సైబర్ నేరాలతో రూ 7,061 కోట్ల దోపిడీ
సత్య నాదెళ్ల, లింక్డ్ఇన్ లకు రూ.27 లక్షల జరిమానా
కేంద్ర ప్రభుత్వానికి ఆర్బీఐ రూ.2 లక్షల కోట్ల డివిడెండ్