అధికమాసం కారణంగా ఈ ఏడాది సెప్టెంబర్ 18 నుండి 26వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని, పెరటాసి మాసం కూడా వస్తున్నందువల్ల భక్తుల రద్దీ అత్యధికంగా ఉంటుంది కావున భక్తులకు ఎలాంటి లేకుండా ఏర్పాట్లు చేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేస్తామని చెప్పారు.
చిరుత దాడిలో మృతి చెందిన చిన్నారి లక్షిత కుటుంబానికి టీటీడీ ద్వారా గతంలో ప్రకటించిన రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియాను రూ.10 లక్షలకు పెంచాలని నిర్ణయించారు. ఈ ఏడాది జరిగే శ్రీవారి సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో మరింత మెరుగ్గా పారిశుద్ధ్య నిర్వహణకు గాను అదనంగా కార్మికులను ఏర్పాటు చేసుకునేందుకు రూ.32.73 లక్షలు మంజూరు చేశారు.
చంద్రగిరి శ్రీ మూలస్థాన యల్లమ్మ ఆలయ పునర్నిర్మాణానికి రూ.2 కోట్లతో టెండరు ఆమోదించారు. ముంబయిలోని బాంద్రాలో రూ.1.65 కోట్లతో శ్రీ వేంకటేశ్వరస్వామివారి రెండో ఆలయం, రూ.5.35 కోట్లతో సమాచార కేంద్రం నిర్మాణానికి పరిపాలన ఆమోదం తెలిపారు. ఈ మొత్తాన్ని టీటీడీ బోర్డు సభ్యులు విరాళంగా అందిస్తారు.
రూ.49.48 కోట్లతో టీటీడీ ఉద్యోగుల 1476 క్వార్టర్ల మరమ్మతులు చేపట్టేందుకు ఆమోదం తెలిపారు. రూ.33 కోట్లతో వడమాలపేట మండలం పాదిరేడు అరణ్యం వద్ద టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాల కోసం కేటాయించిన స్థలంలో రోడ్లు, ఇతర మౌలిక వసతులు కల్పించేందుకు ఆమోదం తెలిపారు. ఈ మొత్తాన్ని ఉద్యోగులు తిరిగి టీటీడీకి చెల్లిస్తారు. రూ.600 కోట్లతో తిరుపతి రైల్వేస్టేషన్ వెనుక వైపు గల 2, 3 సత్రాల స్థానంలో అచ్యుతం, శ్రీపథం వసతి సముదాయాల నిర్మాణానికి ఆమోదం తెలిపారు.
More Stories
పోలీసుల సహకారంతోనే ఎమ్యెల్యే పిన్నెల్లి పరార్!
ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు బంద్
అరెస్ట్ కు ఈసీ ఆదేశంతో ఎమ్యెల్యే పిన్నెల అరెస్ట్