వైసీపీ పాలనలో భారీగా ఆస్తుల దోపిడీ జరిగిందని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ విధ్వంస పాలనను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని హెచ్చరించారు. రైతులకు కూడా చెప్పకుండా వారి భూముల్లో కాల్వలు తవ్వుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పులను ప్రశ్నిస్తే అడ్డుకునే పరిస్థితి కనిపించడంలేదుని పేర్కొన్నారు.
ఇసుక అక్రమాలపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ లో కేసులు వేసిన నాగేంద్రను వేధిస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. రేపో, ఎల్లుండో తననూ అరెస్టు చేయవచ్చని లేదా దాడి చేస్తారని ఆరోపించారు. తాను నిప్పులా బతికానని, ఎప్పుడూ ఏ తప్పూ చేయలేదని చంద్రబాబు తెలిపారు.
వైసీపీ చేసిన తప్పులన్నింటినీ మనపై మోపి కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అంటూ పార్టీ శ్రేణులకు తెలిపారు. 45 సంవత్సరాలుగా తనపై ఎవ్వరూ కేసులు పెట్టలేదని, ఎక్కడా సాక్ష్యాధారాలు లేవని స్పష్టం చేశారు. తనపై దాడి చేసినా చేస్తారని పేర్కొంటూ అయితే తాను ఎవరికీ భయపడనని చంద్రబాబు చెప్పారు.
తనపై దాడి చేసి, రివర్స్లో కేసులు పెడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. అంగళ్లలో తనపై హత్యాప్రయత్నం చేసి తిరిగి తన మీదే 307 కేసు పెట్టారని తెలిపారు. తాను చెబితేనే దాడులు చేశారన్నట్లు స్టేట్మెంట్ రాయించేందుకు టీడీపీ కార్యకర్తలను ఒత్తడి చేస్తున్నారని ఆరోపించారు. యువగళం పాదయాత్రపై దాడులు చేసి, గాయపడిన వారిపైనే తిరిగి కేసులు పెడుతున్నారని తెలిపారు. వైసీపీ పాలన నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పారు. రివర్స్ టెండరింగ్ అని రివర్స్ పాలనకు తెరతీశారని చంద్రబాబు విరుచుకుపడ్డారు.
More Stories
ధర్మవరంలో బిజెపి కార్యకర్తలలపై రెచ్చిపోయిన వైసీపీ మూకలు
బీజేపీ గెలుపు మన దేశానికి అవసరం
ఏపీలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు సీఆర్పీఎఫ్ బలగాలు