
చంద్రుడిపై ఇప్పుడున్న పగటిపూట దశ ముగుస్తు ఉండటంతో చంద్రయాన్ 3లో భాగంగా చంద్రుడి ఉపరితలంపై పరిశోధనలు చేస్తున్న విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ లు త్వరలో నిద్రావస్థలోకి వెళ్లనున్నాయని ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ వెల్లడించారు.
కాగా, విక్రమ్ ల్యాండర్ నుంచి ప్రజ్ఞాన్ రోవర్ సుమారు 100 మీటర్ల దూరం వరకు ప్రయాణించిందని తెలిపారు. విక్రమ్ ల్యాండర్ నుంచి ప్రజ్ఞాన్ రోవర్ సుమారు 101.4 మీటర్ల దూరం వరకు ప్రయాణించిందని శనివారం ఇస్రో ట్వీట్ చేసింది. చంద్రుడిపై కీలకమైన ప్రయోగాల దిశలో ఇది అత్యంత విశిష్టమైన ప్రక్రియ అయింది.
రోవర్ ఇప్పుడు వంద మీటర్ల ప్రయాణం సాగించినా అలుపు సొలుపు లేకుండా పనిచేస్తోందని ఇస్రో తరఫున ట్వీటు వెలువరించారు. ప్రజ్ఞాన్ 100* అని సంబోధించారు. చంద్రుడి ఉపరితల ఫోటోలను ఎప్పటికప్పుడు రోవర్ పంపిస్తోంది.
ఈ నెల 7వ తేదీ దరిదాపుల్లో చంద్రమండలం చీకటి దశకు చేరుకుంటుంది. ఇది 14 రోజుల పాటు ఉంటుంది. పగటిపూట కాంతితోనే ల్యాండర్ రోవర్లు పనిచేస్తూ ఉంటాయి. తరువాత ఇవి పనిచేయడం ఆగిపోతుంది. తరువాతి పగటి దశ వచ్చే వరకూ ఇవి పూర్తిగా అంతరించి పోకుండా ఉంటే తిరిగి వీటిని పగటిపూట కాంతితో పునరుజ్జీవం చేయించవచ్చు.
దీనితో తిరిగి చంద్రుడిపై వీటి అన్వేషణలకు వీలేర్పడుతుందని ఇస్రో వర్గాలు ఆశిస్తున్నాయి. అంతరిక్షం ఇప్పుడు గ్లోబల్ బిజినెస్గా మారిన దశలో చంద్రయాన్ 3 దశలో పరీక్షల ఫలితాలు భారతదేశానికి ఎంతగానో దోహదపడుతాయి. ఈ దిశలో ఇప్పటివరకూ ల్యాండర్, రోవర్ పంపించిన సంకేతాలు , సమాచారం అత్యంత కీలకమైనదిగా భావించాల్సి ఉంటుందని ఇస్రో తెలిపింది.
ఇక్కడ పలు రకాల ఖనిజాలు, మూలకాలు, ఆక్సిజన్ ఆనవాళ్లు ఉన్నాయని కూడా ఇప్పటివరకూ సాగించిన చంద్రయాన్ 3 అధ్యయనంలో వెల్లడైంది. ఇక హైడ్రోజన్ ఆనవాళ్లు కూడా కనుగొంటే చంద్రుడిపై మనిషి ఉండేందుకు వీలుంటుందని విశ్లేషిస్తున్నారు. పైగా అత్యంత విలువైన ఖనిజాలను గుర్తించినట్లు అయితే ఇది భూగోళంలోని మానవాళి చరిత్రను మలుపు తిప్పుతుంది.
అంతరిక్షం ఇప్పుడు గ్లోబల్ బిజినెస్గా మారిన దశలో చంద్రయాన్ 3 దశలో పరీక్షల ఫలితాలు భారతదేశానికి ఎంతగానో దోహదపడుతాయి. ఈ దిశలో ఇప్పటివరకూ ల్యాండర్, రోవర్ పంపించిన సంకేతాలు , సమాచారం అత్యంత కీలకమైనదిగా భావించాల్సి ఉంటుందని ఇస్రో తెలిపింది.
More Stories
చిప్స్ ఐనా, ఓడలైనా స్వావలంబన తప్ప మార్గం లేదు
టీ20లో వేగంగా 100 వికెట్ల తీసిన బౌలర్గా అర్షదీప్
సామ్ పిట్రోడా పాకిస్థాన్ వ్యాఖ్యలపై రాజకీయ చిచ్చు