కాళేశ్వరం ప్రాజెక్టుకు రుణాలు అందజేసింది కేంద్ర ప్రభుత్వ సంస్థలు కాదా? ఇదే విషయాన్ని చెబితే ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని బీజేపీ ఎంపీ, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా. కె. లక్ష్మణ్ ప్రశ్నించారు. శుక్రవారం ఆయన పార్లమెంట్ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రజా అంశాలు చర్చకు రాకుండా ప్రతిపక్ష కూటమి అడ్డుకుందని ఆరోపించారు.
కాంగ్రెస్ గొడవకు వత్తాసు పలికి బీఆర్ఎస్ అవిశ్వాసంలో ఆ పార్టీతో కలిసి నడిచిందని విమర్శించారు. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ సమయంలో సభలో లేని విపక్షాలు అవిశ్వాసం పెట్టడం దేనికని ఆయన నిలదీశారు. కాంగ్రెస్ తోక పార్టీలుగా బీఆర్ఎస్, మజ్లిస్ కూడా వాకౌట్ చేశాయని ఎద్దేవా చేశారు. అవిశ్వాస తీర్మానం పెట్టి చివరి వరకు లేకుండా పారిపోవడం చరిత్రలో బహుశా ఇదే మొదటిసారని అభిప్రాయపడ్డారు.
పార్లమెంటు సాక్షిగా ప్రతిపక్షాలు బొక్క బోర్ల పడ్డాయని, అభాసుపాలయ్యాయని ఎంపీ ధ్వజమెత్తారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి ఆడుతున్న నాటకం ఢిల్లీలో బహిర్గతమైందని ఆయన విమర్శించారు. కేసీఆర్ కుటుంబ పాలన అంతం చేయడానికి బీజేపీ మాత్రమే ఏకైక ప్రత్యమ్నాయని ఎంపీ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు, ప్రత్యామ్నాయంగా అభివృద్ధి ఎజెండాను ప్రజల ముందు ఉంచుతామని వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన గృహాలను ఇప్పటిదాకా నిర్మించి పేదలకు ఇవ్వలేకపోయిన బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారని లక్ష్మణ్ మండిపడ్డారు. పార్లమెంటు సభ్యుడిగా తెలంగాణకు జరుగుతున్న అన్యాయం గురించి బండి సంజయ్ అవిశ్వాస తీర్మానం సందర్భంగా మాట్లాడారని ఆయన కొనియాడారు.
“రజాకార్ల” బృందంకు అభినందన
More Stories
అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు
తెలంగాణ మంత్రివర్గ సమావేశంకు ఈసీ అనుమతి
కేజ్రీవాల్ నిరసన పిలుపుతో ఢిల్లీలో ఉద్రిక్తత