రేడియో కాలర్స్ కారణం గానే చీతాలు మృతి చెందాయని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, సహజ కారణాల వల్లనే చీతాలు మృతి చెందాయని కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ప్రాజెక్ట్ చీతాలో భాగంగా నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి భారత్కు తీసుకొచ్చిన చీతాల వరుస మరణాలపై కేంద్రం స్పందించింది.
కొందరు అంతర్జాతీయ చీతా నిపుణులు వాటికి అమర్చిన రేడియో కాలర్స్ వల్ల ఇన్ఫెక్షన్ సోకి చనిపోతున్నాయనే సందేహాలు వ్యక్తం చేశారని, అయితే గత 25 సంవత్సరాలుగా రేడియో కాలర్స్ ఉపయోగిస్తున్నామని, ఇప్పటివరకు కాలర్స్ వల్ల ఏ వన్యప్రాణికీ ఇన్ఫెక్షన్ సోకిన ఆధారాలు లేవనీ చీతా ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజేష్ గోపాల్ వివరించారు.
ఒకవేళ అదే నిజమైతే ఈ విషయాన్ని రేడియో కాలర్స్ తయారీదారుల దృష్టికి తీసుకెళ్తాం అని ఆయన చెప్పారు. చీతాల మృతికి సంబంధించి నివేదిక రాకుండా ముందే ఒక నిర్ణయానికి రావడం సరైంది కాదని ఆయన హితవు చెప్పారు. ప్రాజెక్ట్ చీతా నిర్వహణ కోసం కేంద్రం నియమించిన కమిటీ చీతాల పరిస్థితిని నిత్యం పర్యవేక్షిస్తుందని , ప్రాజెక్ట్ ప్రారంభదశలో ఉన్నందున జయాపజయాలపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని తెలిపారు.
నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన చీతాలు మధ్య ప్రదేశ్ లోని కునో జాతీయ పార్క్ (కేఎన్పీ)లో వరుసగా మృత్యువాత పడుతున్నాయి. శుక్రవారం మగ చీతా సూరజ్ మృత్యువాత పడడంతో ఐదు నెలల్లో మృతుల సంఖ్య 8కి పెరిగింది. నుంచి మరో చోటకు చీతాలను తరలించే ఆలోచన లేదని కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ శనివారం ప్రకటించారు.
More Stories
అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు
కాశ్మీర్ లో పోలింగ్కు ముందు రెచ్చిపోయిన ఉగ్రవాదులు
దక్షిణాదిన భారీ వర్షాలు.. ఉత్తరాదిన వడగాల్పులు