పాలీథీన్ క్యారీ బ్యాగులు భూమిలోకి కానీ, నీటిలో కానీ కరిగిపోవు. అవి విచ్ఛిన్నమై భూమిలో కలవటానికి 300 నుంచి 500 సంవత్సరాలు పడుతుంది. దీని వల్ల భూమి మీద ప్లాస్టిక్ వ్యర్ధాలు విలయ తాండవం చేసి గాలి, నీటి కాలుష్యాన్ని కలుగ జేస్తున్నాయి. క్యారీ బ్యాగుల్లో ఉన్న ఆహారాన్ని సంచితో కలిపి తినడం వల్ల ఆవులు, పశువులు చనిపోతున్నాయి.
ప్లాస్టిక్ భూతాన్ని అంతమొందించడానికి పాలిథీన్ బ్యాగులకు ప్రత్యామ్నాయంగా 120 రోజుల్లో భూమిలో కలిసిపోయి ఎరువుగా మారే బయోడిగ్రేడబుల్ బ్యాగులను మొక్కజొన్న, బయోపాలిమర్లను కలిపి రూపొందించారు. ఈ బ్యాగుల వల్ల పర్యావరణానికి ముప్పులేదు. పశువులు తిన్నా చనిపోవు.
ఈ టెక్నాలజీని డీఆర్డీవో ఇప్పటికే 40 కంపెనీలకు ఉచితంగా అందించింది. ఇంకా 50 కంపెనీలు ఈ టెక్నాలజీ కోసం వినితి పత్రం దరఖాస్తు చేసుకున్నాయి. ఈ టెక్నాలజీ ఎలా వినియోగించాలి, ఫార్ములా, యంత్రాలు, నాణ్యత ప్రమాణాలు, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ వంటి అవగాహన కార్యక్రమాలను వార్తాపత్రికలు, యూట్యూబ్ మాధ్యమాలలో ఉంచింది.
పర్యావరణానికి ముప్పులేని, భూమిలో కరిగిపోయే బయోడిగ్రేడబుల్ బ్యాగులను రూపొందించినందుకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్, ఢిల్లీ ఈ ప్రతిష్టాత్మకమైన జాతీయ అవార్డును ఎన్విరాన్మెంట్, మేనేజ్మెంట్, క్లైమెటిక్ చేంజ్ 2023 సదస్సు నందు బెంగుళూరులో ప్రదానం చేయడం జరిగినది. విశేష కృషి చేసి ఈ అవార్డు పొందిన డాక్టర్ కే వీరబ్రహ్మంను మిగిలిన శాస్త్రవేత్తలు, పర్యావరణ శ్రేయోభిలాషులు అభినందించారు.
More Stories
సొంత ఇల్లు, కారు, భూమి, షేర్లు లేని ప్రధాని మోదీ
తిహార్ జైలును పేల్చేస్తామని బెదిరింపు
వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్ దాఖలు