అమెరికా అధ్యక్షులు జో బైడెన్ సెప్టెంబర్లో భారతదేశ పర్యటనకు వచ్చే అవకాశం ఉంది. ఈ దిశలో బైడెన్ ఆలోచిస్తున్నారని వైట్హౌజ్ సంబంధిత దక్షిణాసియా, మధ్య ఆసియా వ్యవహారాల ప్రెసిడెంట్ ప్రతినిధి డోనాల్డ్ లూ వార్తా సంస్థలకు తెలిపారు. భారత్ అమెరికా దేశాల సంబంధాలలో ఈ ఏడాది 2023 మైలురాయి కానుందని, అమెరికాకు ఇది ఘననీయమైన సంవత్సరం అవుతుందని ఈ ప్రతినిధి తెలిపారు.
దక్షిణాసియా వ్యవహారాల పర్యవేక్షకులుగా ఉన్న డోనాల్డ్ అమెరికా విదేశాంగ శాఖ సహాయ మంత్రి హోదాలో ఉన్నారు. ఓ వైపు అమెరికా అపెక్కు ఆతిధ్యం ఇస్తోంది. జపాన్ జి 7 సదస్సుకు వేదిక అవుతోంది. జి 20 భేటీ భారతదేశంలో జరుగుతుంది. ప్రపంచ స్థాయిలో ఇటువంటి సమ్మేళనాలు పరస్పర సహకారం విస్తృతికి దోహదం చేస్తాయని అమెరికా ఆశిస్తోందని డోనాల్డ్ లూ తెలిపారు.
వివిధ దేశాలను ప్రపంచ సమస్యల పరిష్కారం దిశలో ఒకే తాటిపైకి తీసుకువచ్చేందుకు ఇటువంటి సమావేశాలు ఉపయోగపడుతాయని వివరించారు. భారత్ జీ 20 అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తిస్తోంది. అందులో భాగంగా ఈ సెప్టెంబర్ నెలలో భారత్ లో జీ 20 దేశాధినేతల సమావేశం నిర్వహించనుంది. ఆ సమావేశానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హాజరవుతున్నారు.
ఈ సందర్భంగా జీ 20 అధ్యక్ష బాధ్యతలను భారత్ సమర్దవంతంగా నిర్వహిస్తోందని అమెరికా ప్రశంసించింది. జీ 20 విదేశాంగ మంత్రుల సదస్సును భారత్ గొప్పగా నిర్వహించిందని ప్రశంసించింది.
భారత్ లో తాను జరపబోయే పర్యటన కోసం తమ అధ్యక్షుడు జో బైడెన్ ఎదురుచూస్తున్నారని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. సంబంధిత వివరాలుత్వరలోనే ఖరారు అవుతాయని ఈ ప్రతినిధి చెప్పారు. భారతదేశంలో పర్యటించే అమెరికా బృందంలో విదేశాంగ మంత్రి టోనీ బ్లింకెన్, ఆర్థిక మంత్రి జనెత్ యెల్లెన్, వాణిజ్య మంత్రి గినా రైమాండో కూడా ఉంటారని స్పష్టం అయింది.
More Stories
ఐరాసలో పాలస్తీనాకు అనుకూలంగా ఓటేసిన భారత్
రఫాపై ఇజ్రాయిల్ దాడులు మరింత ముమ్మరం
అమెరికాలో మరో తెలంగాణ విద్యార్థి అదృశ్యం