
ఆ తరువాత, ఈ సంవత్సరం ఫిబ్రవరి 24 వ తేదీన ప్రయాగ్ రాజ్ లోని తన ఇంటి ముందే ఉమేశ్ పాల్ హత్యకు గురయ్యాడు. ఉమేశ్ తో పాటు ఆయన ఇద్దరు గన్ మెన్లను కూడా చంపేశారు. ఈ ఘటనను యూపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఉమేశ్ పాల్ హత్యలో ప్రధాన నిందితుడైన అసద్ కోసం గాలింపును ముమ్మరం చేసింది. అసద్ పై, గులామ్ పై రూ. 5 లక్షల చొప్పున రివార్డు ప్రకటించింది.
ఈ నేపథ్యంలో గురువారం ఝాన్సీలో అసద్ ఆచూకీపై విశ్వసనీయ సమాచారం రావడంతో యూపీ ఎస్టీఎఫ్ పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో చోటుచేసుకున్న ఎన్ కౌంటర్ లో అసద్, గులామ్ హతమయ్యారు. వారి వద్ద నుంచి అత్యాధునిక విదేశీ తుపాకులను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.
ఈ ఎన్ కౌంటర్ జరుగుతున్న సమయంలో గ్యాంగ్ స్టర్, అసద్ తండ్రి ఆతిఖ్ అహ్మద్ రాజు పాల్ హత్య కేసు విచారణలో భాగంగా కోర్టులో ఉన్నాడు. కొడుకు ఎన్ కౌంటర్ లో చనిపోయిన విషయం తెలియగానే ఆయన కోర్టు హాళ్లోనే కుప్పకూలిపోయాడు. ఇదే కేసులో ఆతిఖ్ అహ్మదాబాద్ లోని సబర్మతి జైళ్లో, ఆతిఖ్ సోదరుడు ఖాలిద్ ఆజిమ్ బరేలీ జైళ్లో శిక్ష అనుభవిస్తున్నారు.
More Stories
జమ్ముకశ్మీర్లో చైనా గ్రెనేడ్లు స్వాధీనం .. ఉగ్ర కుట్ర భగ్నం
అస్సాం రైఫిల్స్ వాహనంపై కాల్పులు.. ఇద్దరు జవాన్లు మృతి
వాతావరణ మార్పుల ప్రభావం.. ఇక ఏటా కుండపోత వర్షాలే!