అమరావతి వద్ద ఉన్న కృష్ణానది నీటి గుంటలో పడి ఇద్దరు విద్యార్థులు ఇటీవల మృతి చెందారు. దీనిపై వైసీపీ, టీడీపీ పార్టీల మధ్య ఆరోపణలు గుప్పించుకన్నారు. ఫలితంగా ఇరు పార్టీల మధ్య రాజకీయ రగడ మొదలైంది. ఇసుక తవ్వకాలపై వైసీపీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ సవాల్ విసురుకున్నారు. సోషల్ మీడియాలోనూ తెగ పోస్టులు చేశారు.
ఇసుకు తవ్వకాల్లో తన ప్రమేయాన్ని నిరూపించాలని వైసీపీ ఎమ్మెల్యే సవాల్ స్వీకరించారు మాజీ ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్. అమరావతిలోని అమరేశ్వర స్వామి ఆలయాన్ని వేదిక చేసుకున్నారు. ఇందుకు ఇద్దరు నేతలు సై అనటంతో ఆదివారం పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆలయం వద్దకు ఇరు పార్టీల కార్యకర్తలు బయల్దేరారు.
రంగంలోకి దిగిన పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఆలయానికి బయల్దేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తీరును ఖండిస్తూ టీడీపీ శ్రేణలు ఆందోళనకు దిగారు. ఓ దశలో లాఠీఛార్జ్ చేశారు.
మరోవైపు ఎమ్మెల్యే అనుచరులు ఆలయం వద్ద హల్ చల్ చేశారు. శ్రీధర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిజానికి రాత్రి నుంచే టీడీపీ నాయకులను ఎక్కడికక్కడ నిర్బంధం చేస్తూ వచ్చారు పోలీసులు. నేతల ఇళ్ల వద్ద పోలీసు పహారా ముమ్మరం చేశారు. ప్రస్తుతం అమరావతిలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.
More Stories
మూడు పార్టీల మేనిఫెస్టో విడుదల రేపే
ఇసుక అక్రమ తవ్వకాలపై జగన్ కు సుప్రీంలో ఎదురుదెబ్బ
నిప్పుల గండంగా మారిన తెలుగు రాష్ట్రాలు