
ముస్లింలు పాకిస్థాన్లో కన్నా భారత్లోనే బాగా సురక్షితంగా ఉన్నారని అజ్మీర్ షరీఫ్ దర్గా ఆధ్యాతిక పెద్ద, ఆల్ ఇండియా సూఫీ సజ్జదానషీన్ కౌన్సిల్ చైర్మన్ హజ్రత్ సయ్యద్ నశీరుద్దీన్ ఛిస్తీ స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీపై పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో విషం కక్కాక ఆయన ఈ విషయం చెప్పారు.
“మన గౌరవనీయ ప్రధానిపై, మన దేశంపై బిలావల్ భుట్టో చేసిన వ్యాఖ్యలను నేను ఖండిస్తున్నాను” అని ఆయన పేర్కొన్నారు. “ఆయన పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ హోదాను తక్కువ చేయడమేకాక, యావత్ పాకిస్థాన్ను తక్కువ చేశారు” అని విమర్శించారు.
“పాకిస్థానీ ముస్లింల కన్నా భారత ముస్లింలు ఎంతో సురక్షితంగా ఉన్నారన్న విషయాన్ని పాకిస్థాన్ మనస్సులో పెట్టుకోవాలి” అని ఆయన హితవు చెప్పారు. ఆయన ఇంకో విషయం కూడా ఈ సందర్భంగా చెప్పారు. అదేమిటంటే, ఉసామా బిన్ లాడెన్ చనిపోలేదు, పాకిస్థాన్లో అమెరికన్ల చేత చంపబడ్డాడని గుర్తు చేశారు.
పాకిస్థాన్ను భారత్ తో పోల్చవద్దని ఆయన బిలావల్ భుట్టోకు ఈ సందర్భంగా నశీరుద్దీన్ ఛిస్తీ హితవు చెప్పారు. “ఎన్నడూ ఘనమైన భారత దేశంతో అస్థిరమైన పాకిస్థాన్ను పోల్చవద్దు. ఎందుకంటే భారత రాజ్యాంగం మత స్వేచ్ఛకు హామీనిచ్చింది” అని ఆయన చెప్పుకొచ్చారు.
More Stories
26/11 ఉగ్రదాడికి ప్రతి దాడి చేయకుండా ఎవరాపారో చెప్పాల్సిందే!
భారత్-యూకే ఒప్పందం భారత్ అభివృద్ధికి లాంచ్ ప్యాడ్
మోహన్లాల్కి మరో అరుదైన గౌరవం