ప్రస్తుతం, ప్రపంచంలో కెల్లా అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న నగరాల సరసన సూరత్ స్థానాన్ని సంపాదించుకొందని చెబుతూ ఇది అంటువ్యాధులకు, వరదలకు ఈ నగరం మారుపేరు అనేటటువంటి అపఖ్యాతిని తెచ్చుకొన్న కాలం కంటే చాలా భిన్నమైందని ప్రధాని చెప్పారు.
డబల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఒనగూరిన సకారాత్మక ప్రభావాలను గురించి ప్రధాన మంత్రి వివరిస్తూ, సూరత్ లో పేద ప్రజలు, మధ్యతరగతి కుటుంబాలకు ఇళ్ళ నిర్మాణం, ఇతర సదుపాయాలు చెప్పుకోదగినంతగా పెరిగాయని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా అందిన లాభాలను గురించి ప్రధాన మంత్రి చెప్తూ, దేశం లో ఇంతవరకు సుమారు 40 మిలియన్ పేద రోగులు ఈ పథకంలో ఉచిత చికిత్స ను అందుకొన్నారని పేర్కొన్నారు.
‘‘వారిలో గుజరాత్ నుండి 32 లక్షల మందికి పైగా రోగులు ఉన్నారు, అందులో సూరత్ నుండే దాదాపుగా 1.25 లక్షల మంది ఉన్నారు’’ అని ప్రధాన మంత్రి చెప్పారు. సూరత్ లో వస్త్రాల వ్యాపారాన్ని గురించి మరియు వజ్రాల వ్యాపారాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, అది దేశం అంతటా అనేక కుటుంబాల మనుగడకు ఊతంగా నిలుస్తున్నదని పేర్కొన్నారు.
డ్రీమ్ సిటీ ప్రాజెక్టు పూర్తి అయింది అంటే గనక సూరత్ ప్రపంచంలోనే అత్యంత భద్రమైనటువంటి, అత్యధిక సౌకర్యవంతం అయినటువంటి వజ్రాల వ్యాపార కేంద్రాలలో ఒకటిగా అభివృద్ధి చెందుతుందని మోదీ భరోసా వ్యక్తం చేశారు.
సూరత్ కు ఆదిలో వజ్రాల నగరం అనే గుర్తింపు ఉండగా, తరువాత అది కాస్తా వంతెనల నగరం గా మారిందని, ప్రస్తుతం విద్యుత్తు వాహనాల నగరం అనే సరికొత్త గుర్తింపు లభిస్తుందని ప్రధాన మంత్రి తెలిపారు. నగరంలో విద్యుత్తు వాహనాలు పెద్ద సంఖ్య లో కనిపిస్తూ ఉండడం గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, సూరత్ అతి త్వరలోనే విద్యుత్తు వాహనాలకు కూడాను ప్రసిద్ధి చెందుతుందని చెప్పారు.
సూరత్ లో గత రెండు దశాబ్దాల లో అభివృద్ధి శరవేగంగా చోటు చోటుచేసుకుందని చెబుతూ, ఈ అభివృద్ధి వేగం రాబోయే సంవత్సరాల లో మరింత పెరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.
More Stories
ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ కుటుంబాన్ని కాపాడుతున్న మంత్రి
రాహుల్ గాంధీ `పాకిస్తాన్ అనుచరుడు’
బ్రిజ్ భూషణ్ సింగ్ కు బిజెపి సీట్ నిరాకరణ!