తాను ప్రజలను కలవాలనుకున్న ప్రతిసారి ఏదొక అడ్డంకి ఎదురవుతోంది గవర్నర్ వాపోయారు. మేడారం జాతరకు వెళ్తానంటే హెలికాప్టర్ ఏర్పాటు చేయలేదని ఆమె గుర్తు చేశారు.చివరి క్షణం వరకు రాష్ట్ర ప్రభుత్వం తనకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని.. అయినా దాదాపు నాలుగు గంటల పాటు రోడ్డు మార్గంలో ప్రయాణం చేసి గిరిజన ప్రజల ఆరాధ్య దైవం సమ్మక్క సారలమ్మ దగ్గరకు చేరానని గవర్నర్ తమిళి సై గుర్తు చేశారు.
ఇదంతా ఎవరి కోసం చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. తనతో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఎంటని ఆమె అడిగారు. మహిళా గవర్నర్గా తనను చాలా తక్కువ అంచనా వేశారని చెబుతూ ఒక మహిళగా పురుషుల కంటే ఎక్కువగా కష్టపడి పని చేయగలనని ఆమె చెప్పారు.
ఈ మూడేళ్లలో రాజ్భవన్ను ప్రజా భవన్గా తీర్చిదిద్ది ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నానని చెబుతూ ఆదివాసీ ప్రాంతాల్లో పర్యటించా నాని,ఎన్నో యూనివర్శిటీలు, విద్యా సంస్థల్లో పర్యటించి సమస్యలు తెలుుసుకున్నానని తెలిపారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు వెతలు చూసి చలించిపోయానని చెబుతూ ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని గవర్నర్ హోదాలో రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తే కనీస స్పందన లేదని ఆమె మండిపడ్డారు.
రాజ్ భవన్ ను ప్రజాభవన్ గా మార్చానని, ప్రజల కోసం రాజ్ భవన్ తలుపులు తెరిచి పెట్టామని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వెల్లడించారు. ప్రభుత్వం సమస్యలు పరిష్కరిస్తే.. ప్రజలు రాజ్ భవన్ కు ఎందుకొస్తారని ప్రశ్నించారు. రాజ్ భవన్ లో మహిళా దర్బార్ ఏర్పాటు చేసి మహిళల సమస్యలను తెలుసుకున్నాం అని చెప్పిన ఆమె, వరదల సమయంలో రెడ్ క్రాస్ ద్వారా సహాయక కార్యక్రమాలు చేపట్టామని వెల్లడించారు. మహిళను అవమానించారన్నది తెలంగాణ చరిత్రలో ఉండకూడదని తన అభిప్రాయమని తెలిపారు.
More Stories
బాల్యం నుండి స్వయంసేవక్ నే… తిరిగి ఆర్ఎస్ఎస్ కోసం పనిచేస్తా!
ఇదో దశలో 60 శాతం దాటిన పోలింగ్
అల్లర్ల నిందితుల అరెస్ట్కు ప్రత్యేక బృందాలు