డీఆర్డీవో, భారత నావికాదళం కలిసి శుక్రవారం ఓ భూమి నుంచి గాలిలోకి షార్ట్ రేంజ్లో ఉన్న టార్గెట్ని ఛేదించే క్షీపనిని విజయవంతంగా ప్రయోగించాయి. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో), భారత నావికాదళం విజయవంతంగా ఈ పరీక్షా జరిపినట్లు అధికారులు తెలిపారు. ఒడిశాలోని చాందీపూర్ తీరంలో ఉన్న భారత నౌకాదళ నౌక నుంచి ఈ ప్రయోగం జరిగిందని డీఆర్డీవో అధికారులు తెలిపారు.
“విఎల్- ఎస్ఆర్ఎస్ఎఎం, సముద్ర-స్కిమ్మింగ్ టార్గెట్ సహా సమీపంలోని వైమానిక దాడులను ఎదుర్కొనేందుకు ఈ ప్రయోగం ఉపయోగపడనుంది. శుక్రవారం నాటి ప్రయోగం ఏంటంటే హై-స్పీడ్ ఏరియల్ టార్గెట్ని ఛేదించేలా దీన్ని నిర్వహించారు. ఇది విజయవంతంగా పూర్తయ్యింది. చాందీపూర్లోని ఐటీఆర్లో అమర్చిన అనేక ట్రాకింగ్ పరికరాలను ఉపయోగించి వాహనం యొక్క విమాన మార్గం, దాని పారామితులను పర్యవేక్షించారు”అని డీఆర్డీవో అధికారులు ప్రకటించారు.
క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినందుకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ డీఆర్డీవో, భారత నౌకాదళాన్ని అభినందించారు. ‘‘ఒడిశాలోని చాందీపూర్ తీరంలో వర్టికల్ లాంచ్ షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ విజయవంతమైన విమాన పరీక్షకు డీఆర్డీవో , ఇండియన్ నేవీ లకు అభినందనలు. ఈ విజయం భారత నౌకాదళ నౌకల రక్షణ సామర్థ్యాన్ని మరింత పెంచుతుంది”అని రాజ్నాథ్ సింగ్ ట్వీట్ చేశారు.
కాగా, వైమానిక బెదిరింపులకు వ్యతిరేకంగా విఎల్- ఎస్ఆర్ఎస్ఎఎం విజయవంతమైన విమాన పరీక్షకు భారత నావికాదళం, డీఆర్డీవోలను నేవల్ స్టాఫ్ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ ప్రశంసించారు. ఈ స్వదేశీ క్షిపణి వ్యవస్థ అభివృద్ధి భారత నౌకాదళంరక్షణ సామర్థ్యాలను మెరుగుపరుస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఈ ప్రయోగాన్ని విజయవంతం చేసినందుకు తమ బృందాన్ని డిపార్ట్ మెంట్ ఆఫ్ డిఫెన్స్ ఆర్ అండ్ డి సెక్రటరీ, డిఆర్డిఓ చైర్మన్ డాక్టర్ జి సతీష్ రెడ్డి అభినందించారు. ఈ పరీక్ష భారత నావికాదళ నౌకల్లో స్వదేశీ ఆయుధాలను అమర్చడాన్ని మరింత మెరుగుపరుస్తుందని పేర్కొన్నారు.
More Stories
ప్రైవేటు వ్యక్తుల పక్షాన ప్రభుత్వం పిటిషన్ వేయడమా?
మూడు ప్రధాన విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
మణిపూర్ లో 6 పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్