షార్ట్​ రేంజ్​ మిస్సైల్​ ప్రయోగం విజయవంతం

డీఆర్​డీవో, భారత నావికాదళం కలిసి శుక్రవారం ఓ భూమి నుంచి గాలిలోకి షార్ట్​ రేంజ్​లో ఉన్న టార్గెట్​ని ఛేదించే క్షీపనిని విజయవంతంగా   ప్రయోగించాయి. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్​డీవో), భారత నావికాదళం  విజయవంతంగా ఈ  పరీక్షా జరిపినట్లు అధికారులు తెలిపారు. ఒడిశాలోని చాందీపూర్ తీరంలో ఉన్న భారత నౌకాదళ నౌక నుంచి ఈ ప్రయోగం జరిగిందని డీఆర్‌డీవో అధికారులు తెలిపారు.

“విఎల్- ఎస్ఆర్ఎస్ఎఎం,  సముద్ర-స్కిమ్మింగ్ టార్గెట్​ సహా సమీపంలోని వైమానిక దాడులను ఎదుర్కొనేందుకు ఈ ప్రయోగం ఉపయోగపడనుంది. శుక్రవారం నాటి ప్రయోగం ఏంటంటే హై-స్పీడ్ ఏరియల్ టార్గెట్​ని ఛేదించేలా దీన్ని నిర్వహించారు. ఇది విజయవంతంగా పూర్తయ్యింది. చాందీపూర్‌లోని ఐటీఆర్‌లో అమర్చిన అనేక ట్రాకింగ్ పరికరాలను ఉపయోగించి వాహనం యొక్క విమాన మార్గం, దాని పారామితులను పర్యవేక్షించారు”అని  డీఆర్​డీవో   అధికారులు ప్రకటించారు. 

క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినందుకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్  డీఆర్​డీవో,  భారత నౌకాదళాన్ని అభినందించారు. ‘‘ఒడిశాలోని చాందీపూర్ తీరంలో వర్టికల్ లాంచ్ షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ విజయవంతమైన విమాన పరీక్షకు  డీఆర్​డీవో , ఇండియన్ నేవీ లకు అభినందనలు. ఈ విజయం భారత నౌకాదళ నౌకల రక్షణ సామర్థ్యాన్ని మరింత పెంచుతుంది”అని రాజ్​నాథ్​ సింగ్​ ట్వీట్​ చేశారు. 

కాగా, వైమానిక బెదిరింపులకు వ్యతిరేకంగా   విఎల్- ఎస్ఆర్ఎస్ఎఎం  విజయవంతమైన విమాన పరీక్షకు భారత నావికాదళం,   డీఆర్​డీవోలను నేవల్ స్టాఫ్ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ ప్రశంసించారు. ఈ స్వదేశీ క్షిపణి వ్యవస్థ అభివృద్ధి భారత నౌకాదళంరక్షణ సామర్థ్యాలను మెరుగుపరుస్తుందని ఆయన పేర్కొన్నారు.

ఈ ప్రయోగాన్ని విజయవంతం చేసినందుకు తమ బృందాన్ని డిపార్ట్ మెంట్ ఆఫ్ డిఫెన్స్ ఆర్ అండ్ డి సెక్రటరీ, డిఆర్‌డిఓ చైర్మన్ డాక్టర్ జి సతీష్ రెడ్డి అభినందించారు. ఈ పరీక్ష భారత నావికాదళ నౌకల్లో స్వదేశీ ఆయుధాలను అమర్చడాన్ని మరింత మెరుగుపరుస్తుందని పేర్కొన్నారు.