మార్చినెలలో 18.05 లక్షల భారతీయ ఖాతాలను వాట్సాప్ నిషేధించింది. తన నెలవారీ నివేదిక ద్వారా వాట్సాప్ ఈ విషయాన్ని వెల్లడించింది.
ఫిర్యాదుల విభాగం ద్వారా వినియోగదారులు చేసిన ఫిర్యాదుల ఆధారంగానూ, నిబంధనల ఉల్లంఘనలను నిరోధించడానికి, గుర్తించడానికి తాను సొంతంగా ఏర్పాటు చేసుకున్న యంత్రాంగం ఆధారంగానూ ఈ నిషేధం విధించినట్లు వాట్సాప్ స్పష్టం చేసింది.
గతేడాది నుంచి అమల్లోకి వచ్చిన నూతన ఐటి నిబంధనల ప్రకారం భారీ డిజిటల్ ఫ్లాట్ఫార్మ్స్ (50 లక్షలకు పైగా వినియోగ దారులు ఉన్నవి) తప్పనిసరిగా ప్రతినెలా నివేదికను వెల్లడించాలి. వచ్చిన ఫిర్యాదులపై తీసుకున్న చర్యలపై పూర్తి వివరాలను తెలపాలి.
ఈ ఏడాది మార్చి 1 నుంచి 31 వరకూ 18.05 లక్షల భారతీయ ఖాతాలను నిషేధించినట్లు వాట్సాప్ తన నివేదికలో తెలిపింది. వినియోగదారులను సురక్షితంగా ఉంచడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇతర అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్నట్లు వాట్సాప్ పేర్కొంది. ఫిబ్రవరి నెలలో 14.26 లక్షల భారతీయ ఖాతాలను వాట్సాప్ నిషేధించింది.

More Stories
మహారాష్ట్ర టెట్ పేపర్ లీక్ ప్రధాన నిందితుడు అరెస్ట్
ఫేషియల్ రికగ్నిషన్ తో ఢిల్లీలో 2,500 మంది దుండగుల గుర్తింపు
సోషల్ మీడియాలో కోర్టు విచారణ వీడియోలు, పోస్టులపై సుప్రీం నిషేధం!