ఆదాయ పన్ను రిటర్నుల దాఖలు గడువును ప్రభుత్వం పొడిగించింది. 2018–19, 2019–20 సంవత్సరాలకు సంబంధించి గడువును జులై 31 వరకు పెంచింది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) ప్రకటన చేసింది.
2018–19 ఏడాదికి గాను రివైజ్డ్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి డెడ్లైన్ ఈ నెలాఖరుతో ముగియనుండగా దాన్ని జులై 31 కి పెంచింది. టాక్స్ ఆడిట్ రిపోర్ట్ అందజేయడానికి గడువును అక్టోబర్ 31కి పెంచింది.
2019–20 ఆర్ధిక సంవత్సరానికి గాను వివిధ డిడక్షన్లు క్లెయిమ్ కు ఇన్వెస్ట్మెంట్ డెడ్లైన్ను కూడా సెప్టెంబర్ 30 దాకా పెంచింది. మరోవైపు, పాన్ కార్డును ఆధార్కార్డుతో లింక్ చేసుకునేందుకు ఇప్పుడున్న గడువును వచ్చే ఏడాది మార్చి 31 దాకా పొడిగిస్తున్నట్లు సీబీడీటీ తెలిపింది.

More Stories
ఓలా, ఉబర్కు పోటీగా ‘భారత్ ట్యాక్సీ’
త్వరలో అల్ హింద్ ఎయిర్, ఫ్లైఎక్స్ప్రెస్, శంఖ్ విమాన సేవలు
రూ.12 వేల కోట్లతో ఢిల్లీ మెట్రో విస్తరణ