ఈ పరిణామాలపై స్పందించిన భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జయస్వాల్, అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన ఒప్పందాన్ని భారత్ స్వాగతిస్తోందని తెలిపారు. “ఈ ఒప్పందంతో హర్మూజ్ జలసంధిలో నౌకాయానం నిరాటంకంగా కొనసాగుతుందని ఆశిస్తున్నాం. శాంతి, ప్రాంతీయ స్థిరత్వం కోసం చేపట్టే ప్రతి చర్యకు భారత్ మద్దతుగా ఉంటుంది. ఈ పరిణామాలను స్ఫూర్తిగా తీసుకుని రష్యా-ఉక్రెయిన్ కూడా శాంతి ప్రయత్నాల దిశగా అడుగులు వేయాలని ఆకాంక్షిస్తున్నాం” అని పేర్కొన్నారు.
నావిగేషన్ స్వేచ్ఛను నిర్ధారించడానికి హార్ముజ్ తెరిచి ఉండాలని భారతదేశం ఎల్లప్పుడూ కోరుతూనే ఉంది, అయితే అన్ని వైరుధ్యాలను చర్చలు, దౌత్యం ద్వారా పరిష్కరించుకోవాలని నొక్కి చెప్పింది. ప్రధాని మోదీ గత మూడు నెలలుగా ప్రపంచ నేతలతో పలుమార్లు కాల్లు జరిపారు, ఈ వివాదంపై భారత్ వైఖరిని పునరుద్ఘాటించారు.
కాగా ఈ ఒప్పందం నేపథ్యంలో మరో వివాదం తెరపైకి వచ్చింది. ఇరాన్తో కుదిరిన శాంతి ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు దెబ్బతీయడానికి ప్రయత్నించారని ట్రంప్ ఆరోపించారు. లెబనాన్ రాజధాని బీరూట్పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడి కారణంగానే వాషింగ్టన్-టెహ్రాన్ మధ్య ఒప్పందం కుదరడంలో జాప్యం జరిగిందని విమర్శించారు. ‘ది న్యూయార్క్ టైమ్స్’ ప్రతినిధులతో ఫోన్ సంభాషణ సందర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.

More Stories
త్వరలో ఎస్పీలో భారీ చీలిక.. బీజేపీ వైపు ఆ పార్టీ నేతలు!
ఉద్ధవ్ శివసేనను కుదిపేస్తున్న ‘ఆపరేషన్ టైగర్’
రాహుల్ గాంధీ టార్గెట్ బీజేపీ కాదు, కూటమి లోని మిత్రపక్షాలే