
సీఎంగా బీజేపీ అభ్యర్ధి ఉంటే బాగుండేదని, కానీ బీజేపీ నేతల కోరిక మేరకే తాను సీఎంగా ప్రమాణం చేయబోతున్నానని ఈ సందర్భంగా నితీష్ కుమార్ చెప్పారు. తనకు మద్దతిస్తున్న ఎన్డీయే ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్కు సమర్పించారు.
తమ ముఖ్యమంత్రి అభ్యర్థి నితీశ్ కుమార్ అని ఎన్నికల ప్రచారం సందర్భంగా బీజేపీ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది.
జేడీయూకు బీజేపీ కన్నా తక్కువ స్థానాలు వచ్చినప్పటికీ నితీశ్ కుమార్నే ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటామని బీజేపీ అగ్ర నేతలు ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. జేడీయూ, బీజేపీ, వీఐపీ, హెచ్ఏఎం కలిసి బిహార్ శాసన సభ ఎన్నికల్లో పోటీ చేశాయి.
ఈ కూటమికి 125 స్థానాలు లభించడంతో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం దక్కింది. బీజేపీ 74, జేడీయూ 43, వీఐపీ 4, హెచ్ఏఎం 4 స్థానాలను సాధించాయి. ఈ కూటమిలోకి ఎల్జేపీని చేర్చుకుంటారా? లేదా? అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. చిరాగ్ పాశ్వాన్ ఈ ఎన్నికల్లో నితీశ్ కుమార్ను తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే.
కాగా, బీహార్ లో బీజేపీ శాసన సభా పక్ష నేతగా తార్ కిశోర్ను ఎన్నుకున్నారు. గతంలో డిప్యూటీ సీఎంగా పనిచేసిన సుశీల్ మోదీ తార్ కిశోర్కు ట్విటర్ వేదికగా కంగ్రాట్స్ చెప్పారు.
More Stories
టీటీడీ పరకామణిలో ఫారిన్ కరెన్సీ దోపిడీపై సీఐడీ దర్యాప్తు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏబీవీపీ ఘనవిజయం
‘మోహన్లాల్’కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు