పంజాబ్ యూనివర్సిటీ క్యాంపస్ స్టూడెంట్స్ కౌన్సిల్ అధ్యక్ష పదవిని వరుసగా రెండోసారి నిలబెట్టుకున్న అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఎబివిపి)కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం అభినందనలు తెలిపారు. ఈ ఫలితం “దేశమే ప్రథమం” అనే సిద్ధాంతంపై యువతకు ఉన్న విశ్వాసానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. అలాగే, కౌన్సిల్ కార్యకర్తలు స్వామి వివేకానంద స్ఫూర్తితో విద్యార్థులకు సేవలు అందిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.
డీన్ (స్టూడెంట్ వెల్ఫేర్) విడుదల చేసిన అధికారిక ఫలితాల ప్రకారం ఎబివిపికి చెందిన అంకిత్ బిధాన్ 3,149 ఓట్లతో అధ్యక్ష పదవిని గెలుచుకున్నారు. ఆయన సమీప ప్రత్యర్థి ఆదిల్ బ్రార్ 2,637 ఓట్లు సాధించగా, 512 ఓట్ల తేడాతో బిధాన్ విజయం సాధించారు. మిగిలిన మూడు పదవులను ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు, ఒక కూటమి అభ్యర్థి గెలుచుకోవడం ద్వారా ఫలితాలు భిన్నంగా నమోదయ్యాయి. ఈ ఫలితం కేవలం తన విజయం మాత్రమే కాదని, “మొత్తం ‘జెన్-జెడ్’ తరం” విజయమని బిధాన్ స్వయంగా పేర్కొన్నారు. యువత హృదయాల్లో ప్రధాని నరేంద్ర మోదీకి, ఏబీవీపీలకు స్థానం ఉందని ఇది నిరూపించిందని ఆయన తెలిపారు.
పంజాబ్, దేశంలోని యువత “పొల్లైన హామీల” కంటే దేశ నిర్మాణానికే మద్దతు ఇస్తున్నారనడానికి ఈ ఫలితం నిదర్శనమని బిజెపి అధ్యక్షుడు నితిన్ నబిన్ పేర్కొన్నారు. దీనిని పార్టీ ‘వికసిత్ భారత్’ (అభివృద్ధి చెందిన భారత్) లక్ష్యంతో ఆయన ముడిపెట్టారు. “పంజాబ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ కౌన్సిల్ ఎన్నికల్లో ఎబివిపి సాధించిన చారిత్రాత్మక విజయం పట్ల యువశక్తికి హృదయపూర్వక అభినందనలు! ఈ అద్భుత విజయం, పంజాబ్, దేశ యువత పనికిరాని హామీలను పక్కనపెట్టి, దేశ నిర్మాణం, సానుకూల నాయకత్వానికి గట్టిగా మద్దతు ఇస్తున్నారనడానికి ప్రత్యక్ష నిదర్శనం,” అని నబిన్ తన ‘ఎక్స్’ ఖాతాలో రాశారు.

More Stories
రామమందిరం తొలి సీఈఓగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా
నిరుద్యోగం, ధరల పెరుగుదల, అవినీతిలపై శ్రీనగర్ లో బిజెపి ఆందోళన
దిశా సాలియన్ మృతిపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశం