* భారత్ సహా పలు దేశాల్లో ప్రకంపనలు
అఫ్గనిస్థాన్లో శనివారం సాయంత్రం తీవ్ర భూకంపం సంభవించింది. హిందూ కుష్ ప్రాంతంలో సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.2 గా నమోదయినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. భూకంప కేంద్రం ఈశాన్య అఫ్గన్లోని కలాఫ్గాన్కు సుమారు 81 కి.మీ. దూరంలో ఉన్నట్లు పేర్కొంది. అయితే, ఉపరితలానికి 215 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉండటంతో దీని ప్రభావం తక్కువగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు.
అమెరికా జియోలాజికల్ సర్వే అఫ్గన్ ఈశాన్య ప్రాంతం జుర్మ్కి 43 కిలోమీటర్ల దూరంలో భూకంపం వచ్చినట్టు వెల్లడించింది. ఈ భూకంప ప్రభావంతో పొరుగున్న పాకిస్థాన్, చైనాలతో పాటు భారత్, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్, కిర్గిజ్స్థాన్లోనూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. కాబూల్, తూర్పు ప్రావిన్సులైన ఖోస్ట్, నంగర్హర్లో భూకంపం సంభవించింది.
కాగా, ఆదివారం తెల్లవారుజామున జపాన్ ఈశాన్య ప్రాంతంలో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారని జపాన్ వాతావరణ సంస్థ (జేఎంఏ) తెలిపింది. భూకంప కేంద్రం భూమికి సుమారు 40 కిలోమీటర్ల లోతులో ఉందని కూడా పేర్కొంది. ఆ ప్రాంతంలో భవిష్యత్తులో కూడా భూకంపాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది. స్థానిక అధికారుల ప్రకారం, ఈ భూకంపం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 5.21 గంటలకు సంభవించింది. ఆమోరి ప్రిఫెక్చర్లోని హచినోహేలో దీని తీవ్రత జపాన్ భూకంప తీవ్రతా ప్రమాణం 7లో 5గా నమోదైంది.
పాక్ రాజధాని ఇస్లామాబాద్, స్వాత్, హంగు, ఉత్తర వజీరీస్థాన్, చిత్రల్, రావల్పిండిలో కూడా ప్రకంపనలు సంభవించాయి. జమ్మూ కశ్మీర్, దేశ రాజధాని ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలలో ఈ ప్రకంపనలు భయాందోళనలను సృష్టించాయి. దీంతో జనం తమ ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. ఫిబ్రవరిలోనూ అఫ్గనిస్థాన్లో భూకంపం చోటుచేసుకుంది. దీని ప్రభావంతో ఢిల్లీతో పాటు ఉత్తరాదిలోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు వచ్చాయి.
రెండు రోజుల కిందట వెనుజులాపై నిమిషాల వ్యవధిలోనే రెండు భూకంపాలు విరుచుకుపడి.. 920 మంది ప్రాణాలు కోల్పోగా.. వేలాది మంది గాయపడ్డారు. రాజధాని కారకస్ సహా అనేక ప్రాంతాల్లో భవనాలు ధ్వంసమయ్యాయి. ఐక్యరాజ్యసమితి సహాయక విభాగం చీఫ్ టామ్ ఫ్లెట్చర్ ప్రకారం.. 50 వేల మందికిపైగా గల్లంతయ్యారు.
రెండు రోజుల కిందట వెనుజులాపై నిమిషాల వ్యవధిలోనే రెండు భూకంపాలు విరుచుకుపడి.. 920 మంది ప్రాణాలు కోల్పోగా.. వేలాది మంది గాయపడ్డారు. రాజధాని కారకస్ సహా అనేక ప్రాంతాల్లో భవనాలు ధ్వంసమయ్యాయి. ఐక్యరాజ్యసమితి సహాయక విభాగం చీఫ్ టామ్ ఫ్లెట్చర్ ప్రకారం.. 50 వేల మందికిపైగా గల్లంతయ్యారు.
శుక్రవారం నుంచి పాకిస్థాన్ నైరుతి ప్రావిన్స్ బలూచిస్థాన్లో కనీసం ఐదు మోస్తరు భూకంపాలు సంభవించాయి. 4.3 నుంచి 5.3 తీవ్రత కలిగిన ఈ ప్రకంపనల వల్ల బర్ఖాన్, ముసఖైల్, కోహ్లు, కింగ్రి, రఖ్ని వంటి మారుమూల ప్రాంతాలలో కనీసం ఐదుగురు గాయపడ్డారు. అనేక ఇళ్ళు దెబ్బతిన్నాయి.

More Stories
షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియలకు పహల్గాం దాడి సూత్రధారి
ఇజ్రాయెల్ – లెబనాన్ మధ్య చరిత్రాత్మక ఒప్పందం
డెన్మార్క్ లో ఇస్లామిక్ ప్రార్థన `అజాన్’పై దేశవ్యాప్త నిషేధం!