పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ రెబల్ గ్రూప్ ఎమ్మెల్యలతో 23 మంది ఎంపీలు ప్రస్తుతం సంప్రదింపులు సాగిస్తున్నట్టు ఆ పార్టీ వర్గాలు తాజాగా పేర్కొంటున్నాయి. దీంతో రాబోయే రోజుల్లా టీఎంసీ పార్లమెంటరీ విభాగం నిట్టనిలువుగా చీలిపోయే అవకాశాలు లేకపోలేదని భావిస్తున్నారు.
పార్లమెంటరీ ప్రత్యేక కూటమిగా ఏర్పాటేందుకు వీరు చర్చలు జరుపుతున్నారని, 12 మందికి పైగా ఎంపీలు ఇందుకు సముఖంగా ఉన్నారని అంటున్నాయి. టీఎంసీ పార్లమెంటరీ ప్రత్యేక కూటమిగా ఏర్పడేందుకు, చీలక తెచ్చేందుకు తగిన సంఖ్యాబలంపై కూడా చర్చ జరుగుతోందని చెబుతున్నారు. టీఎంసీకి లోక్సభలో ప్రస్తుతం 29 మంది ఎంపీలు ఉన్నారు. ప్రత్యేక గ్రూపుగా ఏర్పడి ఫిరాయింపుల చట్టం నుంచి వేటుపడకుండా ఉండాలంటే కనీసం 23 మంది మద్దతు ఇందుకు అవసరమవుతుంది.
రాజ్యసభ పరంగా చూస్తే టీఎంసీకి 13 మంది ఎంపీలున్నారు. ప్రత్యేక గ్రూపుగా గుర్తింపు పొందాలంటే కనీసం 9 మంది ఎంపీలు కలిసిరావాలి. ఈ పరిణామాలపై రెబల్ నేత రీతాబత్ర బెనర్జీని ప్రశ్నించగా, గత వారం రోజుల్లో తాను ఏ ఎంపీతోనూ మాట్లాడలేదని, అందువల్ల వాళ్లు ఏమి చేయాలనుకుంటున్నారో తనకు తెలియదని, అయితే రేపటిరోజు ఏమి జరుగుతుందో ఎవరూ చెప్పలేరని పేర్కొన్నారు.
దీనిపై రాజ్యసభ ఎంపీ సుఖేందర్ శేఖర్ రాయ్ మాట్లాడుతూ, ఇంత తక్కువ సమయంలో 60 మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోవడం ఎప్పుడూ చూడలేదని, అదే స్పందన లోక్సభలోనూ ఉండే అవకాశాలు లేకపోలేదని భావిస్తున్నారు. రాజ్యసభ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ మాట్లాడుతూ, ఎగువ సభలో (రాజ్యసభ) పార్టీ పరిస్థితి “సురక్షితంగా” ఉన్నప్పటికీ, లోక్సభ విషయంలో మాత్రం అలా చెప్పలేమని తెలిపారు.
“ఇంత తక్కువ వ్యవధిలో దాదాపు 60 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడటం నేనెప్పుడూ చూడలేదు. లోక్సభలో కూడా ఇలాంటి పరిణామమే చోటుచేసుకునే అవకాశం ఉంది” అని చెప్పారు. ఒక సీనియర్ టిఎంసి ఎంపీ మాట్లాడుతూ, “పార్లమెంటరీ పార్టీలో చీలిక అనేది ఇక కేవలం సమయం ఆసన్నం కావడమే మిగిలి ఉంది. ఇప్పటికే దాదాపు 20 మంది ఎంపీలు బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నట్లు మాకు తెలిసింది. ఈ సంఖ్య మరింత పెరగవచ్చు” అని పేర్కొన్నారు.

More Stories
కాంగ్రెస్ అవకాశవాద రాజకీయాలు పని చేయడం లేదు
మణిపూర్లో దంపతులు సహా ముగ్గురు కుకీలు మృతి
రెండోసారి యధావిధిగా ఆర్బీఐ వడ్డీ రేట్లు