ఆయన తన వ్యూహాత్మక చర్యలో భాగంగా మాజీ మంత్రి, అతని సన్నిహితుడు పీ తంగమణి, పలువురు సీనియర్ నేతలను పార్టీ నుంచి తొలగించారు. అంతే కాకుండా ఆ స్థానాలను వేరే వ్యక్తులతో భర్తీ చేసి వారికి పార్టీ నుంచి బలమైన సందేశాన్ని పంపారు. రెబల్స్కు నాయకత్వం వహిస్తోన్న సీవీ షణ్ముగం సహా ఇతర నాయకులను పార్టీ పదవుల నుంచి తొలగించడంతో పాటు పార్టీ విప్ను ధిక్కరించి విజయ్కు ఓటేసిన 24 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ను కోరామని అన్నాడీఎంకే పేర్కొంది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వారిని అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేసింది.
కాగా, తమను పార్టీ నుంచి బహిష్కరించడాన్ని రెబల్ నేత షణ్ముగం అపహాస్యం చేశారు. బలపరీక్ష అనంతరం, షణ్ముగం విప్ నియామకాన్ని ప్రశ్నిస్తూ, ఎడప్పాడి కె. పళనిస్వామిని శాసనసభాపక్ష నాయకుడిగా ధృవీకరిస్తూ పార్టీ ఎమ్మెల్యేలు ఎటువంటి తీర్మానంపైనా సంతకాలు చేయలేదని స్పష్టం చేశారు. శాసనసభాపక్ష నాయకుడు, ఉపనాయకుడు, విప్ ఎన్నిక కోసం ఈపీఎస్ జరిగినట్లు పేర్కొన్న సమావేశం అసలు జరగలేదని షణ్ముగం ఆరోపించారు.

More Stories
అయోధ్యలో సిసిటివిలు పర్యవేక్షించే ఆర్ఎంఓ అర్జున్ దేవ్ బదిలీ
32 ఏళ్ల తర్వాత యమునా జలాల ఒప్పందం
చైనా సరిహద్దుల్లో ప్రస్తుతం పరిస్థితులు స్థిరం, సున్నితం