పశ్చిమ బెంగాల్లోని అసన్సోల్ నియోజకవర్గంలో ఏళ్ల తరబడి మూతపడిన దుర్గామాత గుడి తలుపులను బీజేపీ నేతలు పునఃప్రారంభించారు. స్థానికంగా నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా గత కొన్నేళ్ల నుంచి ఆ దుర్గ గుడి మూసివేసి ఉంది. ఈ క్రమంలోనే బీజేపీ అధికారంలోకి రావడంతో ఆ దుర్గగుడిని తెరిచారు.
శ్రీ శ్రీ దుర్గామాత ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉన్న ఈ దుర్గా ఆలయం గతంలో కేవలం దుర్గాపూజ, లక్ష్మీపూజ వంటి పండుగల సమయాల్లోనే తెరిచేవారు. మిగిలిన ఏడాది మొత్తం భక్తులకు అనుమతి ఉండేది కాదు. అయితే పశ్చిమ బర్ధమాన్ జిల్లాలోని అసన్సోల్ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే మొత్తం 9 అసెంబ్లీ స్థానాల్లో తాజా ఎన్నికల్లో బీజేపీ గెలుచుకోవడంతో స్థానికుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది.
అసన్సోల్ ఉత్తర నియోజకవర్గం నుంచి కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యే కృష్ణేందు ముఖర్జీ ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను గెలిస్తే ఆలయాన్ని ఏడాది పొడవునా తెరిపిస్తానని హామీ ఇచ్చారు. మాట ఇచ్చినట్టుగానే ఆయన సోమవారం దుర్గా ఆలయానికి చేరుకుని తలుపులు తెరిపించారు. దుర్గా మాత ఆలయం తిరిగి తెరుచుకున్న తర్వాత భక్తులు, బీజేపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి అక్కడ పూజలు నిర్వహించారు.
చాలా కాలం తర్వాత స్థానిక నివాసితులు ప్రార్థనలు చేయడానికి ఆలయాన్ని సందర్శిస్తున్నారు. పునఃప్రారంభం తర్వాత, స్థానిక బీజేపీ నాయకులు దీనిని ఆ ప్రాంతంలో మారుతున్న రాజకీయ వాతావరణానికి సంకేతంగా అభివర్ణించారు. ఈ ఆలయ తలుపులు తెరుచుకోవడం కేవలం మతపరమైనది మాత్రమే కాకుండా అసన్సోల్ ప్రాంతంలో వచ్చిన రాజకీయ మార్పుకు చిహ్నంగా స్థానికులు అభివర్ణిస్తున్నారు.
బీజేపీ నాయకుడు, ఆలయ కమిటీ సభ్యుడు అయిన నీలు చక్రవర్తి, ఈ పునఃప్రారంభం ఆ ప్రాంతంలోని హిందూ సమాజానికి ఉపశమనం కలిగించిందని తెలిపారు. ఇంతకుముందు ఆలయ ప్రవేశం పరిమితంగా కొన్ని పండుగలకు మాత్రమే తెరిచి ఉండేదని ఆయన పేర్కొన్నారు. ఆలయం సుదీర్ఘకాలం పాటు మూసివేయడానికి ఎన్నికలలో ఓటమి చెందిన టిఎంసి ప్రభుత్వపు “హిందూ వ్యతిరేక” వైఖరే కారణమని ఆయన ఆరోపించారు.
ఈ విషయంపై సంవత్సరాలుగా ఢిల్లీలోని రాజకీయ నాయకత్వానికి పదేపదే విజ్ఞప్తులు చేశామని, ఈ పునఃప్రారంభాన్ని ఇటీవలి ప్రభుత్వ మార్పుతో ముడిపెట్టామని కూడా ఆయన తెలిపారు. చాలా మంది స్థానికులకు, ఆలయం తిరిగి తెరవడం అనేది కేవలం ఒక మతపరమైన ఘట్టంగానే కాకుండా, రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న విస్తృత రాజకీయ మార్పుకు ప్రతిబింబంగా కూడా కనిపిస్తుంది. పశ్చిమ బెంగాల్లో ఒక ప్రధాన రాజకీయ ఫలితం వెలువడిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.

More Stories
కేరళంలో ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెస్ లో పోటా పోటీ!
రాజకీయ వేధింపులకు పాల్పడుతున్న ఆప్ పంజాబ్ ప్రభుత్వం
ప్రముఖ నిర్మాత ఆర్.బి. చౌదరి కన్నుమూత