అల‌ర్ట్ సిస్ట‌మ్‌ తో దేశ‌వ్యాప్తంగా మోగిన మొబైల్ ఫోన్లు!

అల‌ర్ట్ సిస్ట‌మ్‌ తో దేశ‌వ్యాప్తంగా మోగిన మొబైల్ ఫోన్లు!

* సెల్ బ్రాడ్​కాస్ట్‌ను ప్రారంభించిన కేంద్రం

దేశ‌వ్యాప్తంగా కోట్లాది మంది మొబైల్ ఫోన్ల‌లో శనివారం అల‌ర్ట్ మెసేజ్  మార‌మోగింది. కొత్త త‌ర‌హా విపత్తు హెచ్చ‌రిక మెసేజ్‌ను భారత్  ప‌రీక్షించింది. ఈ డ్రిల్‌లో భాగంగా మొబైల్ ఫోన్ల‌కు నోటిఫికేష‌న్ వ‌చ్చింది. భారీగా శ‌బ్ధం చేస్తూ ఫోన్లు మోగాయి. వైబ్రేష‌న్ కూడా ఇచ్చారు. ఏదైనా విప‌త్తు సంభ‌విస్తే, అప్ర‌మ‌త్తంగా ఉండాల‌న్న ఉద్దేశాన్ని తెలియ‌జేసేందుకు మెసేజ్ డ్రిల్ ఏర్పాటు చేశారు. 

సెల్ బ్రాడ్‌కాస్ట్ వార్నింగ్ సిస్ట‌మ్‌ను కేంద్రం కొత్త‌గా డిజైన్ చేసింది. ఆ సిస్ట‌మ్ ప్ర‌కారం ఇవాళ ఉద‌యం 11.46 నిమిషాల‌కు ఎమ‌ర్జెన్సీ సీవియ‌ర్ అల‌ర్ట్ మెసేజ్ మొబైల్ ఫోన్ల‌పై ప్ర‌త్య‌క్ష మైంది. ఆ స‌మ‌యంలో గ‌ట్టిగా ట్యూన్ వ‌చ్చింది. ఫ్లాష్ మెసేజ్ త‌ర‌హాలో ఫోన్ మోగింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, క‌మ్యూనికేష‌న్ మంత్రి జ్యోతిరాధిత్య సింథియా ఈ సిస్ట‌మ్‌ను ప్రారంభించారు. 

సెంట‌ర్ ఫ‌ర్ డెవ‌ల‌ప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ దీన్ని డెవ‌ల‌ప్ చేసింది. సాచెట్ ఫ్లాట్‌ఫామ్‌పై కొత్త అల‌ర్ట్ సిస్ట‌మ్‌ను డెవ‌ల‌ప్ చేశారు. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్తో అల‌ర్ట్‌ను మోగించారు. అల‌ర్ట్ మెసేజ్‌ను సీరియ‌స్‌గా తీసుకోవ‌ద్దు అని, ఇది కేవ‌లం  సెల్ బ్రాడ్‌కాస్ మెసేజ్ వ్య‌వ‌స్థ ఎంత స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేస్తుందో తెలుసుకునేందుకు మెసేజింగ్ చేసిన‌ట్లు ప్ర‌భుత్వం ముందుగానే చెప్పింది. 

ఒక‌వేళ ఫోన్ సైలెంట్‌లో ఉన్నా లేదా డునాట్ డిస్ట‌ర్బ్ మోడ్‌లో ఉన్నా కొత్త త‌ర‌హా అల‌ర్ట్ మెసేజ్ మాత్రం మొబైల్ ఫోన్‌పై ప్ర‌త్య‌క్షం అవుతుంది. అలారం శ‌బ్ధం బ‌లంగా వినిపిస్తుంది. త‌క్ష‌ణ‌మే ఫోన్ వాడే వ్య‌క్తి ఆ మెసేజ్‌ను చ‌దివే రీతిలో డిస్‌ప్లే చేశారు. భూకంపాలు, సునామీలు, పిడుగుపాటు లాంటి స‌హ‌జ విప‌త్తులు సంభ‌వించిన‌ప్పుడు, గ్యాస్ లీకేజీలు, ర‌సాయ‌నిక చ‌ర్య‌ల స‌మ‌యంలోనూ కొత్త త‌ర‌హా అల‌ర్ట్ సిస్ట‌మ్‌ను వాడుకోవ‌చ్చు

అయితే ఇది పరీక్ష మాత్రమేనని, ఎవరూ భయపడొద్దని అధికారులు ఆ సందేశంలోనే వివరించారు. ఈ సందేశం ఇంగ్లీష్, హిందీతో పాటు ప్రాంతీయ భాషల్లో కూడా వచ్చింది. అలర్ట్​ మెసేజ్​ వచ్చిన వారు భయపడాల్సిన అవసరం లేదని భారతీయ టెలీ కమ్యూనికేషన్‌ శాఖ ఎక్స్​లో పోస్ట్​ చేసింది.

 
 ‘మీ ఫోన్స్​కు ఏదైనా అలర్ట్ మెసేజ్​ వస్తే ఆందోళన చెందవద్దు. విపత్తుల సమయంలో కచ్చితమైన సమాచారం సకాలంలో తెలిపేలా చేయడం కోసం చేపట్టిన అత్యవసర హెచ్చరిక వ్యవస్థ. దానిని పరీక్షించడంలో భాగంగానే వచ్చింది’ అని డోంట్ పానిక్ అని వీడియోను పోస్ట్​ చేసింది. అయితే ఈ ఎమర్జెన్సీ అలర్ట్ గురించి ముందుగానే మెసేజ్​లు వచ్చాయి. మే 2న హెచ్చరికలు వస్తాయని, ఎవరూ భయాందోళలను చెందాల్సిన అవసరం లేదని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.
2023 సెప్టెంబర్​ 21వ తేదీన పాన్ ఇండియా ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ పేరిట మెసేజ్​లు పంపించింది. అప్పుడు కూడా అలర్ట్ మెసేజ్​లని, వాటిని పట్టించుకోవద్దంటూ తెలిపింది. వేర్వేరు మొబైల్ టవర్స్ ఈ వ్యవస్థను పరీక్షిస్తారు. అందువల్ల ఈ హెచ్చరికలు ఒకటి కంటే ఎక్కువసార్లు రావొచ్చని అధికారులు పేర్కొన్నారు. అలా వచ్చినప్పుడు ఎవరూ స్పందించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. టెస్టింగ్ పూర్తయ్యాక, ఈ వ్యవస్థ అధికారికంగా ప్రారంభమవుతుంది.