దుమ్ముగూడెం మండలం పర్ణశాల వద్ద నీటిమట్టం పెరగడంతో నార చీరల ప్రాంతం వరదనీటిలో మునిగింది. చర్ల మండలంలోని తాలుపేరు జలాశయానికి ఎగువ ప్రాంతం నుంచి వరదనీరు వచ్చి చేరుతున్నాయి. ఈ ప్రాజెక్టు వద్ద 8 గేట్లను ఎత్తి అధికారులు 10 వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువన ఉన్న గోదావరి నదిలోనికి విడుదల చేస్తున్నారు.
గోదావరి నీటిమట్టం పెరుగుతుండటంతో మత్స్యకారులు గోదావరి పరివాహక ప్రాంతం వద్దకు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. ప్రస్తుతం 9,32,288 క్యూసెక్యుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరి నది పరిహహక ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు.
వరద పరిస్థితులను జిల్లా యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తున్నదని, ఎటువంటి అత్యవసర పరిస్థితులు తలెత్తిన వెంటనే అవసరమైన చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ప్రజలు రక్షణ చర్యల్లో సహకరించాలని, అధికారుల సూచనలను కచ్చితంగా పాటించాలని కలెక్టర్ కోరారు. అత్యవసర సేవలకు కంట్రోల్ రూమ్ నెంబర్లకు సంప్రదించాలని కలెక్టర్ పేర్కొన్నారు.

More Stories
కిషన్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి అబద్దాలు!
మెట్రో ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి తప్పుడు ఆరోపణలు
ఎసిబి సోదాల్లో సర్వే డిప్యూటీ డైరెక్టర్కు రూ.200 కోట్ల ఆస్తుల