
తన పరిధిలో ఉండటంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తరచూ బెరదింపులకు దిగుతున్నాడని, గతంలో తన భర్త నుండి రూ.25 లక్షలు వసూలు చేశారని, ఏప్రిల్ 18న ఫోన్ చేసి మరో రూ.50 లక్షలు డిమాండ్ చేశారని మనోజ్రెడ్డి భార్య కట్టా ఉమాదేవి ఆరోపించారు. ఉమా దేవి ఫిర్యాదు ఆధారంగా హన్మకొండ సుబేదారి పోలీసులు కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.
దీనిపై 308(2), 308(4), 352 బీఎన్ఎస్ సెక్షన్ల కింద సుబేదారి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ కేసును కొట్టేయాలని పేర్కొంటూ కౌశిక్రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను జస్టిస్ కె.లక్ష్మణ్ ధర్మాసనం కొట్టేసింది. తాజాగా అదే బెదిరింపు కేసులో కౌశిక్ రెడ్డి ముందస్తు బెయిల్ ఇవ్వాలని వేసిన మరో పిటిషన్ను సైతం హైకోర్టు నిరాకరించింది.
కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు నోటీసులు జారీచేస్తూ విచారణను ఈనెల 24కు వాయిదా వేసింది. దీంతో కౌశిక్ రెడ్డి గత రాత్రి శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో ఉన్నాడని తెలుసుకున్న సుబేదారి పోలీసులు అరెస్ట్ చేసి ఠాణాకు తరలించారు. కాసేపట్లో ఎంజీఎం ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం, అతన్ని కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.
More Stories
హెచ్సీఏ వ్యవహారంపై ఈడీ దృష్టి
రాజాసింగ్ రాజీనామా ఆమోదించిన జేపీ నడ్డా
‘స్థానిక’ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఆర్డినెన్స్