
భారతదేశాన్ని రక్షణ రంగంలో స్వావలంబన దిశగా నడిపించే ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. ఈ లక్ష్య సాధనలో భాగంగా రాష్ట్రంలో పలు డిఫెన్స్ సంస్థలు ఏర్పాటు చేయాలని, అందుకు తమ ప్రభుత్వం అని విధాల సహకరిస్తుందని చెప్పారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు శుక్రవారం ఏడుగురు కేంద్ర మంత్రులతో భేటీకానున్నారు.
ఈ సందర్భంగా రాజ్ నాథ్ తో జరిపిన భేటీలో రాష్ట్ర సమగ్రాభివృద్ధి, ముఖ్యంగా రక్షణ రంగంలో ఆంధ్రప్రదేశ్ను అగ్రగామిగా నిలిపేందుకు రూపొందించిన సమగ్ర ప్రణాళికపై ఇరువురు నేతలు విస్తృతంగా చర్చించారు. ఇక రాష్ట్రంలో వ్యూహాత్మక మౌలిక సదుపాయాల కల్పన, విధానపరమైన నూతన ఆవిష్కరణల ద్వారా రక్షణ, ఏరోస్పేస్ పరిశ్రమలకు ఆంధ్రప్రదేశ్ను ఒక ఆకర్షణీయ గమ్యస్థానంగా మార్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తదుపరి మీడియాకు ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనలపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సానుకూలంగా స్పందించారని, రాష్ట్ర అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారని చంద్రబాబు పేర్కొన్నారు.
అంతకు ముందు, కేంద్ర ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో సమావేశమై రాష్ట్రంలో హరిత ఇంధనాన్ని ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా, పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన కింద రూఫ్టాప్ సోలార్ సామర్థ్య కేటాయింపుల కోసం ఒక ప్రతిపాదనను సమర్పించారు. ఈ ప్రతిపాదన కింద 20 లక్షల ఎస్సీ, ఎస్టీ గృహాలకు ఉచిత రూఫ్టాప్ సోలార్ సిస్టమ్లు లభిస్తాయి. అలాగే, బీసీ గృహాలకు కిలోవాట్కు రూ.10,000 చొప్పున 2 కిలోవాట్ల వరకు అమర్చుకునేలా సబ్సిడీ అందుబాటులో ఉంటుంది.
More Stories
యోగా మానవతను పెంచే సామూహిక పక్రియ.. మోదీ
ఇజ్రాయెల్తో జరుగుతున్న యుద్ధంలో ఏకాకిగా ఇరాన్
స్విస్ బ్యాంకుల్లో 18 శాతం తగ్గిన భారతీయుల డిపాజిట్లు