
ఇక 26/11 ముంబై ఉగ్రదాడి సూత్రధారుల్లో ఒకరైన తహవూర్ హుస్సేన్ రాణాను అమెరికా ఇటీవలే భారత్కు అప్పగించిన విషయం తెలిసిందే. అమెరికా తరహాలోనే పాక్ సైతం ఉగ్రవాదులను భారత్కు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. హఫీజ్ సయీద్, సాజిద్ మీర్, జకీర్ రెహ్మాన్ లఖ్వీల వంటి ఉగ్రవాదులను భారత్కు అప్పగించాలని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఉగ్రవాద ముప్పును ఎదుర్కొంటున్న దేశాలు దానికి వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. మే 10వ తేదీన నూర్ ఖాన్ స్థావరంపై భారత్ జరిపిన దాడిని ‘గేమ్ ఛేంజర్’గా అభివర్ణించిన ఆయన ఈ ఘటనతో పాకిస్థాన్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయని చెప్పారు. దీంతో కాల్పుల విరమణ కోసం పాక్ డీజీఎంవో భారత ప్రతినిధులను సంప్రదించారని వెల్లడించారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతోందని స్పష్టం చేశారు.
సింధు జల ఒప్పందం నిలిపివేతను సమర్ధిస్తూ, ఈ ఒప్పందం రెండు సూత్రాలపై ఆధారపడి ఉందని ఆయన చెప్పారు. సద్భావన, స్నేహం అని పేర్కొంటూ “గత చాలా సంవత్సరాలుగా, మనం చూసినది ఏమిటంటే మేము నీటిని ప్రవహించడానికి అనుమతిస్తున్నాము. పాకిస్తాన్ ఏమి చేస్తోంది? వారు ఉగ్రవాదాన్ని అనుమతిస్తున్నారు” అని గుర్తు చేశారు. “ఇది ఇలాగే కొనసాగకూడదని ప్రజల్లో చాలా నిరాశ ఉంది. ఈ దాడి తర్వాత, మా ప్రధాన మంత్రి రక్తం, నీరు కలిసి ప్రవహించలేవని స్పష్టం చేశారు” అని తెలిపారు.
More Stories
పాక్ వైమానిక, సైనిక స్థావరాలపై ట్రంప్ కన్ను!
పాక్ కు చైనా ఐదోతరం స్టెల్త్ ఫైటర్ జెట్ల సరఫరా
ఇరాన్పై బలప్రయోగం వద్దని చైనా, రష్యా హెచ్చరికలు