బంగ్లాదేశ్​ దిగుమతులపై భారత్ ఆంక్షలు

బంగ్లాదేశ్​ దిగుమతులపై భారత్ ఆంక్షలు
భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకునే సరకులపై బంగ్లాదేశ్ గత నెల ఆంక్షలు విధించిన నేపథ్యంలో కేంద్రం గట్టిగా బదులిచ్చింది. బంగ్లాదేశ్ దిగుమతులపై ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బంగ్లాదేశ్ తయారీ రెడీమేడ్ దుస్తులు, శుద్ధి చేసిన ఆహార పదార్థాలు, కార్బొనేటెడ్ డ్రింక్స్, పత్తి, నూలు వ్యర్థాలు, ప్లాస్టిక్, పీవీసీ వస్తువులు, కలప ఫర్నీచర్ వంటి దిగుమతులపై భారత్‌ ఆంక్షలు విధించింది. 

వీటిని అసోం, మేఘాలయ, త్రిపుర, మిజోరం, బంగాల్‌లోని సరకు రవాణా, సమీకృత తనిఖీ కేంద్రాల నుంచి ఇకపై అనుమతించరు. కేవలం కోల్‌కతా, ముంబయిలోని జవహర్‌లాల్‌ నెహ్రూ నౌకాశ్రయాల నుంచి మాత్రమే దేశంలోకి అనుమతిస్తారు. అయితే, బంగ్లాదేశ్ నుంచి దిగుమతి చేసుకునే చేపలు, ఎల్పీజీ, కంకర, వనస్పతికి ఈ ఆంక్షలు వర్తించవని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 

భారత్ ద్వారా ఇతర దేశాలకు వెళ్లే వస్తువులకు కూడా ఆంక్షలు వర్తించవని పేర్కొంది. దాదాపు 93 శాతం బంగ్లాదేశ్ ఎగుమతులు భారత్​లోని ఈ మార్గాలనే ఉపయోగించుకుంటున్నాయి. తాజా కేంద్ర నిర్ణయంతై రెడీమెడ్ గార్మెంట్ రంగంపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు అంటున్నారు. భారత్​కు ప్రతి ఏటా దాదాపు 740 మిలియన్ డాలర్ల ఎగుమతులు జరుగుతాయని చెబుతున్నారు.

బంగ్లాదేశ్ ఎగుమతి సరుకును భారత ఓడరేవులు, విమానాశ్రయాల ద్వారా మూడవ దేశాలకు తరలించడానికి అనుమతించే దాదాపు ఐదు సంవత్సరాల నాటి ట్రాన్స్-షిప్మెంట్ ఒప్పందాన్ని భారతదేశం ముగించిన ఐదు వారాల తర్వాత ఈ చర్య వచ్చింది.  ఇది రెండు దక్షిణాసియా పొరుగు దేశాల మధ్య లోతైన ఆర్థిక సహకారాన్ని సూచించే ఒక అడుగు.

ఈ పరిణామంతో పరిచయం ఉన్న ప్రభుత్వ అధికారులు ఈ నిర్ణయం దీర్ఘకాలంగా ఉన్న వాణిజ్య అసమానతలు, భారత ఎగుమతులపై, ముఖ్యంగా ఈశాన్య ప్రాంతం నుండి ఆంక్షలను సడలించడానికి బంగ్లాదేశ్ నిరాకరించడం వల్ల జరిగిందని చెప్పారు. ఈశాన్య ప్రాంతం నుండి విలువ ఆధారిత వస్తువులకు ప్రవేశాన్ని నిరాకరిస్తున్నారని, ఈ ప్రాంతంలో పారిశ్రామిక వృద్ధికి ఆటంకం కలిగించే వివక్షత కలిగిన పోర్ట్, రవాణా ఛార్జీలను అమలు చేస్తున్నారని భారత అధికారులు ఆరోపించారు.

“ఈశాన్య ప్రాంతంలో భారతదేశం, బంగ్లాదేశ్ మధ్య 11 భూ రవాణా పాయింట్లు ఉన్నాయి. భారతదేశం సంవత్సరాలుగా ఈ పాయింట్ల ద్వారా బంగ్లాదేశ్ వస్తువులను ఉచితంగా యాక్సెస్ చేయడానికి అనుమతించినప్పటికీ, బంగ్లాదేశ్ భారతీయ ఉత్పత్తులకు, ముఖ్యంగా నూలు, ప్రాసెస్ చేసిన వస్తువులు,  బియ్యం కోసం నిరంతరం పరిమిత ప్రాప్యతను కలిగి ఉంది, ”అని ఒక అధికారి తెలిపారు.

మరోవైపు భారత సరిహద్దులోని సుందర్‌బన్స్‌లో జల మార్గంలో తేలియాడే సరిహద్దు గస్తీ కేంద్రాన్ని (బీఓపి) ఏర్పాటు చేశామని బంగ్లాదేశ్‌ సరిహద్దు రక్షక దళం (బీజీబీ) శనివారం తెలిపింది. ఢాకాకు నైరుతి దిక్కున 300 కిలోమీటర్ల దూరంలో రాయ్‌ మన్గోల్‌ నది, బోయెసింగ్‌ కాలువ కలిసే చోట ఈ బీఓపీ పహారా కాస్తుందని చెప్పింది. 

బోయెసింగ్‌ కాలువ ద్వారా మానవ అక్రమ రవాణా జరుగుతోందనీ, అటవీ ఉత్పత్తుల లూటీ, ఇతర సరిహద్దు నేరాలు కొనసాగుతున్నాయని బంగ్లా సీనియర్‌ అధికారి జహంగీర్‌ ఆలం చౌధరి వెల్లడించారు. ఈ అక్రమ కార్యకలాపాలు నిరోధించడానికి మూడో బీఓపీని ప్రారంభిస్తున్నామని తెలిపారు. సుందరవనాల్లో మొట్టమొదటి బీఓపీని 2013లో, రెండోది 2017లో ఏర్పాటుచేశారు.