
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్ కుంగిన అంశంపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అ థారిటి(ఎన్డిఎస్ఎ) నివేదిక భయంకరమై న వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చిం ది. నిర్మాణ నాణ్యత లోపాలులే కారణమని తేల్చింది. డిజైన్ లో పాలు వెలుగులోకి వచ్చాయని, స్పిల్వే గేట్ల నిర్మాణంలో లోపా ల కారణంగా ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయని వెల్లడించింది.
బ్యారేజీల నిర్మాణ సమయంలో నీటిని నియంత్రించే నిర్మాణాలు తగిన నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడమే ప్రధాన కారణమని తేల్చింది. మేడిగడ్డ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు జలశక్తి మంత్రిత్వ శాఖ 2024 మార్చిలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్డిఎస్ఎ)కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల రూపకల్పన, వాటి నిర్మాణాలను పరిశీలించింది.
కమిటీ తన తనిఖీల్లో మూడింటిలోనూ నిర్మాణ భద్రతా లోపాలను గుర్తించింది. మేడిగడ్డ బ్యారేజ్లో బ్లాక్- 7 వద్ద బీటలు, వంకరలు, హైడ్రో-మెకానికల్ వైఫల్యాలను గుర్తించింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలోనూ అలాంటి నిర్మాణ లో పాలు, సీపేజీ, కాంక్రీట్ పగుళ్లు కనిపించాయని పేర్కొంది. గోదావరి నదిపై నిర్మించిన ఈ మూడు బ్యారేజీలు కాళేశ్వరం ప్రాజెక్టు కు కీలకంగా ఉన్నాయి.
మేడిగడ్డ నుంచి అన్నారం, అక్కడి నుంచి సుందిళ్ల బ్యారేజీకి, చివరకు యల్లంపల్లి జలాశయానికి నీటిని లిఫ్టింగ్ చేస్తారు. బ్యారేజీలు 2019లో వినియోగంలోకి వచ్చాయి. పలు బ్యారేజీలలో లోపల అనుమానాస్పద రంధ్రాలు ఉండే అవకాశం ఉందని, అవి ఇప్పటికీ ప్రమాదకరం కాకపోయినా, భవిష్యత్తులో ప్రమాదాలకు కారణం కావచ్చని వెల్లడించింది.
ఈ మూడు బ్యారేజీలకు సమగ్ర పునరుద్ధరణ డిజైన్ అవసరమని కమిటీ తేల్చి చెప్పింది. భవిష్యత్తు చర్యలకు గట్టి సాంకేతిక మౌలికాధారంగా వ్యవహరించడానికి అక్కడి మట్టి పరిస్థితులపై విశ్లేషణ, హైడ్రాలిక్ మోడలింగ్, మేథమెటికల్ మోడలింగ్ అవసరమని సూచించింది. వర్షాకాలానికి ముందు నిర్మాణాలను తాత్కాలికంగా సంరక్షించడానికి కొన్ని అత్యవసర చర్యలు, పరిక్షణలు చేపట్టాలని కమిటీ సూచించింది.
హైడ్రాలిక్ మోడల్ అధ్యయనాల్లో కొన్ని కీలక వినియోగ పరిస్థితులు పరిగణనలోకి తీసుకోకపోవడం, అలాగే డిజైన్ లోపాలు వెలుగులోకి వచ్చాయి. స్పిల్వే గేట్ల నిర్మాణంలో లోపాల కారణంగా ప్రమాదకర స్థితులు ఏర్పడ్డాయని పేర్కొంది.
ఇలా ఉండగా, కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కమిషన్ మే నెలలో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను అందజేయనున్నది. గురువారం కమిషన్ కార్యాలయానికి వచ్చిన జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ తుది దశ విచారణ క్రమాన్ని మొదలుపెట్టారు. ఇప్పటి వరకు జరిపిన విచారణల ద్వారా వచ్చిన సమాచారంతో సుమారు 400 పేజీలతో కూడిన నివేదికను సిద్ధం చేసినట్లు విశ్వసనీయ సమాచారం.
దీంతో దాదాపుగా తొంబై శాతం రిపోర్టు పూర్తి అయినట్లుగా భావిస్తున్నారు. తుది నివేదిక రూపకల్పనలో దేశంలో చోటుచేసుకున్న కొన్ని కీలక కేసుల సారాంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కీలకంగా భావిస్తున్న ఎన్డిఎస్ఎ రిపోర్టును ఇవ్వాలని ఇప్పటికే కమిషన్ ఎన్డిఎస్ఎ కు లేఖ రాసింది. మే తొలి వారంలో పాత ప్రభుత్వంలోని కొందరు ప్రముఖులను కూడా విచారించే అవకాశాలు ఉన్నాయి. మాజీ సిఎం కె.చంద్రశేఖర్రావు, ఆనాటి నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్రావు, నాటి ఆర్ధిక మంత్రి ఈటల రాజేందర్ తదితరులకు కమిషన్ నోటీసులు ఇచ్చి వారిని విచారించే అవకాశం లేకపోలేదు.
More Stories
ఎస్ఎఫ్ఐ నేతగా ఉంటూ ఆర్ఎస్ఎస్ వైపు … నేడు రాజ్యసభకు
లక్నోలో ‘కాకోరీ రైలు ఘటన’ శతాబ్ది ఉత్సవాలు
అంతరిక్షం నుంచి శుభాంశు శుక్లా తిరుగు ప్రయాణం