
దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న బంగ్లాదేశీయులకు జనన ధ్రువీకరణ పత్రాల మంజూరు కేసులో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఢాకా నుంచి అక్రమంగా కోల్కతా చేరి, అక్కడి నుంచి హైదరాబాద్లో స్థిరపడ్డ మహ్మద్ హసిబుల్ కేసులో తీగ లాగితే డొంక కదిలింది. నిందితుల్లో నార్సింగి మున్సిపాలిటీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి సుధీర్ కుమార్, ఏజెంట్లు మహ్మదులీజ్, టి.సాయికిరణ్, రజనీకాంత్, బంగ్లా దేశస్థులు మహ్మద్ హసిబుల్, రోహన్ ఉన్నారు.
నిందితుల నుంచి 7 సెల్ఫోన్లు, ల్యాప్టాప్, నకిలీ ఆధార్, ఓటర్ గుర్తింపు, బర్త్ సర్టిఫికెట్లు, బంగ్లా పాస్పోర్టు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బంగ్లాదేశ్లోని ఢాకాకు చెందిన మహ్మద్ హసీబుల్ (25), రోమన్ సాహ(21) నాలుగేళ్ల క్రితం అక్రమ రవాణాదారులకు రూ. 25వేలు చెల్లించి గుట్టుగా బంగ్లాదేశ్ నుంచి పశ్చిమబెంగాల్కు అక్రమంగా వచ్చారు. కోల్కతాలోని సౌత్హారాలో ఉంటూ హాసిబుల్ తన పేరును జోవన్ చౌదరిగా మార్చుకొని కరాటే శిక్షకుడిగా పని చేశాడు.
విశ్వసనీయ సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి నకిలీ ఆధార్ కార్డులు, బంగ్లాదేశ్ పాస్పోర్టు జిరాక్స్, ఏడు సెల్ఫోన్లు, ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్నారు. కాగా, నకిలీ సర్టిఫికెట్ జారీ చేసి అరెస్టయిన కంప్యూటర్ ఆపరేటర్ సుధీర్కుమార్ జారీ చేసిన సర్టిఫికెట్లన్నీ రద్దు చేస్తున్నట్లు నార్సింగ్ మునిసిపల్ కమిషనర్ కృష్ణమోహన్రెడ్డి తెలిపారు.
More Stories
తెలంగాణ రాజ్భవన్లో మార్ఫింగ్ రచ్చ
కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు
ఆందాల పోటీలకు రూ.300 కోట్లు, పుష్కరాలకు రూ.35 కోట్లా!