హైదరాబాద్ స్థానిక సం స్థల ఎమ్మెల్సీ స్థానానికి బుధవారం జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి అనురాగ్ జయంతి తెలిపారు. ఉదయం 8 గం ల నుండి సా. 4 గం.ల వరకు పోలింగ్ నిర్వహించగా, మధ్యాహ్నం 2 గంటల వరకే 78.57 శాతం ఓట్లు పోల్ అయ్యాయని తెలిపారు. జీహెచ్ఎంసీ ప్రధాన కా ర్యాలయంలో ఏర్పాటు చేసిన రెండు పోలింగ్ కేం ద్రాల్లో మొత్తం ఓటర్లు 112 మందిలో 88 మంది ఓట ర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
మొత్తం 112 ఓటర్లలో ఎక్స్ అఫిషియో మెంబర్లు 31 కాగా, అందులో 22 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 81 మంది కార్పొరేటర్లలో 66 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.’ ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు 37.51 శాతం పోలింగ్ నమోదు కాగా, మధ్యాహ్నం 12 గంటల వరకు 77.68 శాతం, మధ్యాహ్నం 2 గంటల వరకు 78.57 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. సా. 4 గం.ల వరకు 78.57 శాతం పోలింగ్ జరిగిందని తెలిపారు.
ఎన్నికల పరిశీలకులు సురేంద్ర మోహన్ రిటర్నింగ్ అధికారితో కలిసి పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. పోలింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్సులను రిసెప్షన్ సెంటర్ కు బందోబస్తు మధ్య తీసుకువచ్చారు. వాటిని స్ట్రాంగ్ రూంలో భద్రపరిచారు. స్ట్రాంగ్ రూం వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నెల 25న ఉద్యం 8 గం.లకు ఓట్ల లెక్కింపు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని పన్వర్ హాల్ లో నిర్వహించడం జరుగుతుందని రిటర్నింగ్ అధికారి వెల్లడించారు.
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి 22 ఏళ్ల తర్వాత ఎన్నిక జరగడం గమనార్హం. ఈ స్థానానికి ఎంఐఎం, బీజేపీ అభ్యర్థులు పోటీపడుతున్నారు. బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ గౌతంరావు, ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్ ఉల్ హాసన్ పోటీలో ఉన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉన్నాయి. బీఆర్ఎస్ ఓటింగ్లో సైతం పాల్గొనబోమని ప్రకటించింది.
More Stories
కాళేశ్వరం కమిషన్ బ్లాక్ మెయిల్ కోసమా?
తెలంగాణ రాజ్భవన్లో మార్ఫింగ్ రచ్చ
కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు