
భారతి ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వోడాఫోన్ సంస్థలు ఇప్పటికే మొబైల్ నెట్వర్క్ కవరేజీ మ్యాప్లను తమ వెబ్సైట్లలో ప్రచురించాయి. అయితే బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ మాత్రం ఇంకా ఆ కవరేజ్ మ్యాప్ లింక్లను రిలీజ్ చేయలేదు. అన్ని కంపెనీలకు చెందిన లింక్లను ట్రాయ్ వెబ్సైట్లో కూడా పోస్టు చేశారు.
కవరేజీ మ్యాప్ల్లో యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్లు ఉన్నట్లు ట్రాయ్ తెలిపింది. మన ఏరియాలో ఎక్కడ 2జీ, 3జీ, 4జీ, 5జీ టెక్నాలజీ అందుబాటులో ఉందో ఆ వెబ్సైటలో చూసి తెలుసుకోవచ్చు. వివిధ రకాల రంగుల్లో కవరేజీ మ్యాప్లను రూపొందించారు. తమ లొకేషన్లో ప్లాన్ మార్చుకోవాలనుకున్న వారు.. మ్యాప్ ద్వారా ఆ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. మ్యాప్లతో కస్టమర్లు తమ డేటాను విశ్లేషించుకోవచ్చు.
More Stories
పహల్గాం ఉగ్రదాడిలో హమాస్ హస్తం?
కాశ్మీర్ లోయలో ఐదుగురు ఉగ్రవాదుల ఇళ్ల పేల్చివేత
వక్ఫ్ సవాల్ చేసిన పిటిషన్లను కొట్టివేయాలని కోరిన కేంద్రం