
గతంలో కూడా ఆయన పౌరసత్వం గురించి అనేక ఆరోపణలు వచ్చాయి. అయితే, ఈసారి అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ ఈ అంశంపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని హోం మంత్రిత్వ శాఖకు నాలుగు వారాల సమయం ఇచ్చింది. ఈ కేసు విచారణలో, రాహుల్ గాంధీ పౌరసత్వం గురించి ఉన్న అనుమానాలను నివృత్తి చేయడానికి అవసరమైన సమాచారాన్ని సమర్పించాలని కోర్టు ఆదేశించింది.
రాహుల్ గాంధీ బ్రిటన్ పౌరుడని, భారత పౌరసత్వాన్ని రద్దు చేయాలంటూ బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి, కర్ణాటకకు చెందిన బీజేపీ కార్యర్త విఘ్నేశ్ శిశిర్ వేసిన పిటిషన్లపై న్యాయస్థానం తాజా ఆదేశాలు ఇచ్చింది. తన వద్ద ఉన్న రహస్య ఈమెయిళ్ల ఆధారంగా రాహుల్ గాంధీ విదేశీ పౌరసత్వాన్ని నిరూపించవచ్చని శిశిర్ స్పష్టం చేస్తున్నారు.
ఈ విషయంపై యుకె ప్రభుత్వానికి చెందిన ప్రత్యక్ష సమాచారం కూడా అందిందని ఆయన తెలిపారు. ఈ పిటిషన్ దాఖలు చేయడం ద్వారా రాహుల్ గాంధీ పౌరసత్వం గురించి ఉన్న అనుమానాలను స్పష్టంగా చర్చించాలనుకుంటున్నారు.
ప్రస్తుతం రాహుల్ గాంధీ పౌరసత్వ వివాదం రాజకీయంగా దుమారం రేపనుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ఈ అంశాన్ని తమకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని చూస్తుండగా, బీజేపీ మాత్రం ఈ అంశం గురించి మరింత గట్టిగా ప్రశ్నించే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఈ కేసు పరిణామాలు, రాహుల్ గాంధీ రాజకీయ భవిష్యత్తుపై కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది.
కాగా, బ్రిటన్లో నమోదైన ఓ కంపెనీకి రాహుల్ గాంధీ డైరెక్టర్, సెక్రటరీగా ఉన్నారని సుబ్రహ్మణ్య స్వామి కొంత కాలంగా ఆరోపిస్తూనే ఉన్నారు. ఆ కంపెనీ వార్షిక నివేదికలో తనను తాను బ్రిటిష్ పౌరుడిగా రాహుల్ గాంధీ పేర్కొన్నట్లు సుబ్రహ్మణ్య స్వామి తెలిపారు. వేరే దేశంలో పౌరుడిగా ఉన్న వ్యక్తి భారత దేశ పౌరసత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
అలా చేయకపోవడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 9, భారతీయ పౌరసత్వ చట్టం, 1955ని ఉల్లంఘించడమే అవుతుందని స్వామి పేర్కొన్నారు. ఇదే అంశంపై గతంలో కేంద్రానికి కూడా ఆయన లేఖ రాశారు. మరోవైపు తన వద్ద రాహుల్గాంధీ పౌరసత్వానికి సంబంధించి యూకే ప్రభుత్వం సమర్పించిన రికార్డులు ఉన్నాయని విఘ్నేశ్ చెబుతున్నారు.
More Stories
పహల్గాం ఉగ్రదాడిలో హమాస్ హస్తం?
కర్రెగుట్టల్లో భారీ ఎన్కౌంటర్.. 38 మంది మావోలు మృతి
కాశ్మీర్ లోయలో ఐదుగురు ఉగ్రవాదుల ఇళ్ల పేల్చివేత