
ఒక్కమాటలో చెప్పాలంటే యూపీఐ లావాదేవీలకు అనుమతించినందుకు చిన్న వ్యాపారులు ఒక్కో ట్రాన్సాక్షన్పై 0.15 శాతం ప్రోత్సాహం పొందుతారు. అంతకంటే ఎక్కువ మొత్తం లావాదేవీలపై మాత్రం ప్రోత్సాహకాలు ఉండవు. ఇక ఈ మొత ప్రతి త్రైమాసికాల్లో బ్యాంకులు ఎలాంటి షరతులు లేకుండా క్లెయిమ్ మొత్తంలో 80 శాతం వరకు ఇవ్వాల్సి ఉంటుంది.
యూపీఐ లావాదేవీల ప్రయోజనాలు
- సులువుగా డబ్బులు పంపడానికి, భద్రంగా ఉండడానికి, త్వరగా డబ్బు చేతికి రావడానికి డిజిటల్ చెల్లింపులు ఉపయోగపడతాయి. దీనివల్ల రుణం తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది.
- సామాన్య ప్రజలు.. ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా యుపిఐ ద్వారా సులువుగా డబ్బులు పంపుకోవచ్చు.
- చిన్న వ్యాపారులు కూడా ఎలాంటి ఖర్చు లేకుండా యూపీఐ సేవలను ఉపయోగించుకోవచ్చు. చిన్న వ్యాపారులు ధరల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు కాబట్టి.. వారికి యుపిఐ చెల్లింపులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం కొన్ని ప్రోత్సాహకాలు ఇస్తుంది.
- ప్రభుత్వం నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తోంది. డిజిటల్ రూపంలో లావాదేవీలు చేయడం వల్ల లెక్కలు చూపడానికి సులువుగా ఉంటుంది. అంటే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేయడం ద్వారా నగదు వాడకం తగ్గించాలనేది ప్రభుత్వం ప్రధాన లక్ష్యంగా ఉంది.
ఇదే సమయంలో రూ.10,601 కోట్లతో అసోంలో కొత్త అమ్మోనియా యూరియా కాంప్లెక్స్ను ఏర్పాటు చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అప్పుడు దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని మంత్రి చెప్పారు. పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం రూ.2,790 కోట్లు కేటాయించారు. నవీ ముంబైలోని జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ పోర్ట్ను నేషనల్ హైవేతో కలుపుతూ 6 లైన్ రహదారి నిర్మాణానికి రూ. 4,500 కోట్లు కేటాయించింది.
More Stories
పహల్గాం ఉగ్రదాడిలో హమాస్ హస్తం?
కాశ్మీర్ లోయలో ఐదుగురు ఉగ్రవాదుల ఇళ్ల పేల్చివేత
ఏపీ పట్టణాల్లో స్లీపర్సెల్స్ పై పోలీసుల డేగకన్ను