
వివిధ విభాగాలలో ప్రముఖులైన నలుగురు ఎపి ప్రభుత్వం సలహాదారులుగా నియమించింది. భారత్ బయోటెక్ ఎండీ సుచిత్ర ఎల్లను గౌరవ సలహాదారుగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చేనేత, హస్తకళల అభివృద్ధికి గౌరవ సలహాదారుగా నియమిస్తూ ఏపీ సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
సుచిత్ర ఎల్ల కేబినెట్ ర్యాంకుతో రెండేళ్ల కాలానికి ఈ పదవిలో ఉంటారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చేనేత, హస్తకళల అభివృద్ధి రూపకల్పనకు ఆమె నుంచి సలహాలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది
ఏరో స్పేస్, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గౌరవ సలహాదారుగా డీఆర్డీవో మాజీ చీఫ్ జి.సతీష్రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేబినెట్ ర్యాంక్ హోదాలో ఆయన రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. ప్రస్తుతం సతీష్రెడ్డి కేంద్ర రక్షణ శాఖ సలహాదారుగా ఉన్నారు.
రక్షణ రంగ పరిశ్రమల ఏర్పాటుకు సలహాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను కోరింది. పారిశ్రామిక కారిడార్లు, క్లస్టర్లు, టెస్టింగ్ ఫెసిలిటీల్లో పరిశ్రమల ఏర్పాటు, ఏఐ, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ, డీప్టెక్లో సలహాలు, సూచనలు ఇవ్వాలని సతీష్ రెడ్డిని ప్రభుత్వం కోరింది. యువతకు.. నైపుణ్య శిక్షణ ఇచ్చేలా ఆయన సలహాలు ఇవ్వనున్నారు.
ఏపీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ గౌరవ సలహాదారుగా కేపీసీ గాంధీ నియమితులయ్యారు. గాంధీని రెండేళ్ల పాటు కేబినెట్ ర్యాంకు హోదాలో నియమిస్తూ సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఏపీ స్పేస్ టెక్నాలజీ గౌరవ సలహాదారుగా శ్రీధర పనిక్కర్ సోమనాథ్ నియమితులయ్యారు. ప్రస్తుతం సోమ్నాథ్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో పనిచేస్తున్నారు. పాలనా వ్యవహారాలు, పరిశ్రమలు, పరిశోధనలో సలహాలు ఇవ్వాలని ప్రభుత్వం కోరింది.
అదేవిధంగా స్మార్ట్ సిటీస్, డిజాస్టర్ మేనేజ్మెంట్లో సాంకేతిక సలహాలు, ఉపగ్రహాలు, రిమోట్ సెన్సింగ్, కమ్యూనికేషన్ టెక్నాలజీపై సలహాలు ఇవ్వాలని సోమనాథ్ను ప్రభుత్వం కోరింది. జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, శాటిలైట్ నావిగేషన్, ఆర్టిఫిషియల్ స్పేస్ అనలటిక్స్, స్పేస్ అప్లికేషన్లలో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామం, స్పేస్ టెక్నాలజీలో ఏపీ వర్సిటీలకు సలహాలు, సూచనలు ఇవ్వాలని తెలిపింది. వ్యవసాయం, విపత్తుల్లో అర్బన్ప్లానింగ్, వాతావరణ మార్పులపై స్పేస్ టెక్నాలజీ వినియోగంపై సలహాలను కోరింది.
More Stories
ఏపీ పట్టణాల్లో స్లీపర్సెల్స్ పై పోలీసుల డేగకన్ను
ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన చంద్రమౌళి అంత్యక్రియలు
అమరావతిలో రూ 1 లక్ష కోట్ల పనులకు ప్రధాని మోదీ శ్రీకారం