
విదేశాంగ శాఖలో వ్యయం తగ్గింపు చర్యల గురించి ప్రశ్నిస్తూ మస్క్, మొదటి 45రోజుల కాలంలో రూబియో ఒక్కరిని కూడా ఉద్యోగం నుండి తొలగించలేదని వ్యాఖ్యానించారు. దీనికి రూబియో ఘాటుగా స్పందించారు. ఇప్పటికే 1500 మంది విదేశాంగ శాఖ ఉద్యోగులు ముందుగానే పదవీ విరమణ చేయడానికి అంగీకరించారని, ఒకవేళ తాను ఎవరినన్నా తీసేయాలనుకుంటే ఆ 1500మందిని మళ్లీ విధుల్లోకి తీసుకుని, తొలగించాలని వ్యంగంగా వ్యాఖ్యానించారు.
మరోవైపు రవాణా శాఖ మంత్రి డఫీతో మస్క్కు చిన్నపాటి ఘర్షణ నెలకొంది. కీలకమైన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లను తొలగించడానికి మస్క్ ప్రయత్నిస్తున్నారని డఫీ ఆరోపించారు. దానిపై మస్క్ స్పందిస్తూ ఆయన అబద్ధాలు చెబుతున్నారని పేర్కొన్నారు. ఈలోగా ట్రంప్ జోక్యం చేసుకుని వాదనలను సద్దుబాటు చేయడానికి ప్రయత్నించారు. ఇకపై ప్రతిష్టాత్మకమైన మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుతున్న మేథావుల నుండి కంట్రోలర్లను నియమించాల్సి వుందని వ్యాఖ్యానించారు.
రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ట్రంప్.. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్) శాఖను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ శాఖ బాధ్యతలను టెస్లా బాస్ ఎలాన్ మస్క్కు అప్పగించారు. మెరుగైన పాలన, ప్రభుత్వంలో వృథా ఖర్చుల్ని తగ్గించేందుకు డోజ్ శాఖ వేల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులను తొలగిస్తోంది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో అప్రమత్తమైన ట్రంప్ కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేశారు.
More Stories
హసీనాను స్వదేశానికి రప్పించేందుకు విశ్వప్రయత్నాలు
వంద ఏళ్లైనా ఏఐతో ప్రోగ్రామర్లను భర్తీ చేయలేరు
భారత్ ను మినహాయించి 22 దేశాలపై ట్రంప్ సుంకాలను